సంగెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం

సంగెం (జనవరి – 25) జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ కోదాటి శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల సంగెం లో ఘనంగా నిర్వహించడం (VOTERS DAY IN GJC SANGEM) జరిగింది.

ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ శ్రీధర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన విద్యార్థులు ఓటుహక్కును సద్వినియోగం చేసుకొని ప్రజాస్వామ్య మనుగడ కోసం సరైన నాయకులను ఎన్నుకోవడంలో తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. అదేవిదంగా పౌరశాస్త్ర అధ్యాపకులు యాక సాయిలు విద్యార్థుల చేత ఓటరు ప్రతిజ్ఞను చేయించి, విద్యార్థులకు ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించారు.

ఈ కార్యక్రమంలో అధ్యాపకులు అనిల్ కుమార్, నాగరాజు, మాధవి, రాఖీ, సునీల్ రెడ్డి, రవి, బుచ్చిరెడ్డి, కుమారస్వామి, సుధీర్ కుమార్, సదయ్య, పద్మ, ఫాతిమా, జాహేదా మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.