చరిత్రలో ఈరోజు ఆగస్టు 31

◆ సంఘటనలు

1857: భారత స్వాతంత్ర్యోద్యమము: ఢిల్లీ ఆక్రమణ జూలై 1న ప్రారంభమై ఆగస్టు 31 న పూర్తయింది. ఈ యుద్ధంలో ఒకవారంపాటు అడుగడుగునా వీధిపోరాటం జరిగింది.

◆ జననాలు

1864: ఆదిభట్ల నారాయణదాసు, హరికథా పితామహుడు. (మ.1945).
1923: చెన్నమనేని రాజేశ్వరరావు, విద్యార్థి దశలోనే జాతీయోద్యమంలోనూ, నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ పాల్గొన్నారు (మ.2016).
1925: ఆరుద్ర, కవి, గేయరచయిత, సాహితీవేత్త, కథకుడు, నవలారచయిత, విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు (మ.1998).
1932: రావిపల్లి నారాయణరావు, 80 కథలు రాశారు. ‘పెళ్ళాడి ప్రేమించు’ అనే కథా సంపుటి తెలుగు వారికందించారు.
1934: రాజశ్రీ, సినిమా పాటల రచయిత. (మ.1994)
1936: తురగా జానకీరాణి, రేడియోలో పాటలు, నాటికలు, రూపకాలు వంటి ఎన్నో కార్యక్రమాలను రూపొందించి, చిన్నారులతో ప్రదర్శింపచేశారు. (మ.2014).
1944 : వెస్ట్‌ఇండీస్ కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు క్లైవ్ లాయిడ్ జననం
1949 : అమెరికా నటుడు రిచర్డ్ గేర్ జననం.
1960: హసన్ నస్రల్లా, లెబనాన్ దేశానికి చెందిన షియా ఇస్లామిక్ నాయకుడు.
1962: మల్లిపూడి మంగపతి పళ్ళంరాజు, 14వ లోక్‌సభ సభ్యుడు.
1969: జవగళ్ శ్రీనాథ్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
1975 : ఉడతా రామకృష్ణ, సదా మీకోసం పత్రిక సంపాదకులు జననం.
1979: యువన్ శంకర్ రాజా, తమిళ, తెలుగు చిత్రాల సంగీత దర్శకుడు

◆ మరణాలు

1997: ప్రిన్సెస్ డయానా, బ్రిటన్ యువరాజు ప్రిన్స్ చార్లెస్ మాజీ భార్య (జ.1961).
2014: బాపు, చిత్రకారుడు, సినీ దర్శకుడు (జ.1933).