చరిత్రలో ఈరోజు ఆగస్టు 29

◆ దినోత్సవం

  • తెలుగు భాషా దినోత్సవము – (గిడుగు రామమూర్తి జయంతినే తెలుగు భాషా దినోత్సవముగా జరుపుతున్నారు.)
  • జాతీయ క్రీడా దినోత్సవం (ధ్యాన్ చంద్ జయంతినే జాతీయ క్రీడా దినోత్సవముగా జరుపుతున్నారు.)
  • అంతర్జాతీయ అణుపరీక్షల వ్యతిరేక దినోత్సవం

◆ సంఘటనలు

1842: నాన్‌కింగ్ సంధి జరిగి నల్లమందు యుద్ధాలు (ఓపియం వార్స్) ఆగిపోయాయి. నాన్‌కింగ్ సంధి ప్రకారం హాంగ్ కాంగ్ దీవిని బ్రిటన్ కి దత్తత ఇచ్చారు.
1885: గోట్‌లీబ్ డైమ్లెర్ ప్రపంచంలోని మొట్టమొదటి మోటారు సైకిల్ కి పేటెంట్ తీసుకున్నాడు.
1898: గుడ్ ఇయర్ టైర్ల కంపెనీని స్థాపించారు.
1910: జపాన్ కొరియా పేరును ఛోసెన్ గా మార్చీ, ఆ కొత్త వలసను పాలించటానికి ఒక గవర్నర్ జనరల్ ను నియమించింది.
1915: యు.ఎస్. నేవీ గజ ఈతగాళ్ళు ప్రమాదంలో మొదటిసారిగా ములిగిపోయిన ఎఫ్-4 అనే జలాంతర్గామిని బయటికి తీసారు.
1916: ఫిలిప్పైన్స్ అటానమీ చట్టాన్ని (స్వయంగా పాలించుకోవటం) అమెరికా ఆమోదించింది.
1930: సెయింట్ కిల్డాలో వివసిస్తున్న చివరి 36 మంది ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసి, స్కాట్లాండులోని ఇతర ప్రదేశాలకు తరలిపోయారు.
1944: స్లొవేకియాలోని స్లొవాక్ దళాలు 60, 000 మంది నాజీలకు వ్యతిరేంగా ఉద్యమింఛటంతో స్లొవాక్ లో జాతీయతా భావం ఉప్పొంగింది. ఆనాటినుంచి, 29 ఆగస్టుని జాతీయతా భావం ఉప్పొంగిన దినంగా జరుపుకుంటున్నారు స్లొవేకియా లో.
1949: సోవియట్ యూనియన్ తన మొట్ట మొదటి అణుబాంబును (పేరు : ఫస్ట్ లైట్నింగ్ (లేక) జోయ్ 1) కజకిస్తాన్ లోని సెమిపలతిస్‌స్క్ అనే చోట పరీక్షించింది.
1957: స్ట్రామ్ థర్మాండ్, అమెరికన్ సెనేట్ లో 24 గంటలకు పైగా సివిల్ రైట్స్ బిల్లు పై వ్యతిరేకంగా మాట్లాడి రికార్డు సృష్టించాడు. ఆ బిల్లు పాస్ అయ్యింది.
1958: యునైటెడ్ స్టేట్స్ఏయిర్ ఫోర్స్ అకాడెమీని, కొలరాడో లోని కొలరాడొ స్ప్రింగ్స్ అనే చోట ప్రారంభించారు.
1965: అమెరికన్ రోదసి నౌక జెమిని-5 భూమికి తిరిగి వచ్చింది
1966: బీటిల్స్ (గాయకుల బృందం] తమ చివరి కచేరిని అమెరికాలోని, సాన్‌‍ఫ్రాన్సిస్కో లోని కేండిల్‌స్టిక్ పార్క్ దగ్గర చేసారు.
1982: కృత్రిమంగా తయారుచేసిన రసాయన మూల్లకం మీట్నెరియం (అటామిక్ నెంబరు 109) ని మొట్టమొదటిసారిగా జర్మనీ లోని, డార్మ్‌స్టాడ్ దగ్గర గెసెల్‌స్చాఫ్హ్ట్ ఫర్ స్చెరిఒనెన్ఫొర్స్కంగ్
1984: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా శంకర్ దయాళ్ శర్మ నియమితులయ్యాడు.
1986: బ్రిటన్ లోని కవలలు తమ 100వ పుట్టిన రోజు జరుపుకున్నారు. 70 కోట్లమందిలో ఒక్కరికే ఇటువంటి అవకాశం ఉంటుంది. వీడియో చూడటానికి ఇక్కడ నొక్కు
1991: సుప్రీం సోవియెట్ (రష్యా పార్లమెంటు) కమ్యూనిస్ట్ పార్టీ కార్యక్రమాలను ఆపి వేసి, కమ్యూనిస్ట్ పార్టీకి చరమ గీతం పాడింది.
2005: హరికేన్ కత్రినా అమెరికాలోని గల్ఫ్ తీరాన్ని తాకి, మిసిసిపి, లూసియానా ల లోని సముద్ర తీర పట్టణాలను నాశనంచేసి 10లక్షల మందిని నిరాశ్రయులను చేసి, 1, 000 మంది మరణానికి కారణమయ్యింది.

◆ జననాలు

1863: గిడుగు రామమూర్తి, తెలుగు భాషావేత్త. (మ.1940)
1902 : వెరియర్ ఎల్విన్, రాజనీతి పండితుడు, భారతీయ గిరజన జాతుల సమర్థకుడు.
1905: ధ్యాన్ చంద్, భారత హాకీ క్రీడాకారుడు. (మ.1979)
1926: రామకృష్ణ హెగ్డే, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి .
1928: రావు బాలసరస్వతీ దేవి, పాతతరం తెలుగు చలనచిత్ర నటి, నేపథ్యగాయని.
1958: మైకల్ జాక్సన్, అమెరికా సంగీత కళాకారుడు. (మ.2009)
1959: అక్కినేని నాగార్జున, తెలుగు చలనచిత్ర నటుడు, అక్కినేని నాగేశ్వరరావు కుమారుడు.
1974 : దామరకొండ ప్రవీణ్ కుమార్ రైతు సమితి మండల కో-ఆర్డినేటర్, మాజీ సర్పంచ్, అమీనాపురం గ్రామం, కేసముద్రం మండలం, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ.

◆ మరణాలు

1950: వేటూరి ప్రభాకరశాస్త్రి, రచయిత. (జ.1888)
1976: ఖాజీ నజ్రుల్ ఇస్లాం, బెంగాలీ కవి, సంగీతకారుడు, విప్లవకారుడు, ఉద్యమకారుడు, పద్మ భూషణ పురస్కార గ్రహీత. (జ.1899)
2018: నందమూరి హరికృష్ణ, సినిమా నటుడు, ఎన్. టి.రామారావు కుమారుడు, కారు ప్రమాదంలో గాయపడి మరణం. (జ.1956)
2022: అభిజిత్ సేన్ ఆర్థికవేత్త. ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు. (జ.1950)