MSN ల్యాబ్‌కు ఎంపికైన జీజేసి నంగునూర్ విద్యార్థులు

నంగునూరు (జనవరి – 01) : సోమవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలుర) సిద్దిపేట నందు MSN LABORATORIES PVT LTD CAMPUS SELECTION 2023 వారు నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నంగునూరుకు చెందిన నలుగురు ఇంటర్ సెకండియర్ విద్యార్థులు నందిని (BiPC), అక్షయ (MPC), అజయ్ (MPC) మరియు సాదుల్లా (MPC) ఎంపికయ్యారని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కిషన్ గారు ఒక ప్రకటనలో తెలియజేశారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో కష్టపడి చదివితే మునుమందు ఇలాంటి అవకాశాలు అందరికీ కల్పిస్తామని, కావున విద్యార్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకొని పరిసర ప్రాంతంలోని విద్యార్థులను మన కళాశాలలో చేర్పించి అందరూ మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా ళ విద్యార్థులను ప్రిన్సిపాల్ కిషన్ గారితో సహా అధ్యాపకులు జ్యోతి, భీమ్రావు, భరత్, కవిత, స్వామి గౌడ్, శ్రీలత, సిహెచ్ దేవయ్య, చారి, అశోక్ బాల్ లింగం, రేవంత్ మరియు నాన్ టీచింగ్ స్టాప్ కృష్ణారెడ్డి, కరుణ కుమారి విద్యార్థులను కళాశాలలో ఘనంగా సన్మానించారు.