IPL 2024 – అశుతోష్ శర్మ అదరగొట్టిన తప్పని ఓటమి

BIKKI NEWS (APRIL 18) : IPL 2024 లో భాగంగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు 9 పరుగుల తేడాతో సంచలన విజయం (MI BEATS PBKS IN IPL 2024) సాదించింది. విజయం పై ఆశలు వదులుకున్న సమయంలో అశుతోష్ శర్మ వీరవీహరం చేసిన చివర్లో ఔట్ కావడంతో పంజాబ్ కు పరాజయం తప్పలేదు.

మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు 192/7 పరుగులు చేసింది. సూర్య కుమార్ యాదవ్ – 78, రోహిత్ – 38, తిలక్ వర్మ – 34 పరుగులతో రాణించారు. హర్షల్ పటేల్ – 3, శ్యామ్ కర్రాన్ – 2 వికెట్లు తీశారు.

అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన పంజాబ్ కింగ్స్ జట్టు 183 పరుగులకు ఆలౌట్ అయింది. అశుతోష్ శర్మ – 61, శశాంక్ సింగ్ – 41, హర్‌ప్రీత్ బ్రార్ – 21 పరుగులతో రాణించారు. బుమ్రా – 3, కోయిట్జే – 3 వికెట్లు తీశారు.

ఈ ఓటమితో పంజాబ్ కింగ్స్ ప్లే ఆప్స్ అవకాశాలు బాగా సన్నగిల్లాయి. ముంబై ఇండియన్స్ ప్లే ఆప్స్ అవకాశాలు కొంచెం మెరుగుపడ్డాయి.