MSN కంపెనీ లో జాబ్ సాధించిన జీజేసీ నంగునూరు విద్యార్థులు

BIKKI NEWS (JUNE 27) : GJC NANGUNUR STUDENTS GOT JOB IN MSN COMPANY. ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల సిద్దిపేటలో MSN కంపెనీ వారు నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్ లో ప్రభుత్వ జూనియర్ కళాశాల నంగునూరుకు చెందిన సందీప్ రెడ్డి, శ్రీనాథ్ మరియు సాయి చరణ్ అనే ముగ్గురు విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ కిషన్ అధ్యాపక బృందం జ్యోతి, భీమ్రావు, భరత్, కవిత, స్వామి గౌడ్, శ్రీలత, దేవయ్య, రమణాచారి, అశోక్, బాల్ లింగం, రేవంత్, సీనియర్ అసిస్టెంట్ కృష్ణారెడ్డి, జూనియర్ అసిస్టెంట్ కరుణ కుమారి జాబ్ సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు.

కళాశాల ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక బృందం మాట్లాడుతూ ఇప్పటికే మన కళాశాల నుండి ఈ సంవత్సరం 10 మంది విద్యార్థులు కంపెనీలో జాబ్ సాధించారని, వారికి జీతంతో పాటు హాస్టల్ వసతి మరియు ఉచితంగా డిగ్రీ కంపెనీ వాళ్ళే చదివిస్తారని తెలియజేశారు.

కావున మన కళాశాలలో చేరి క్రమశిక్షణతో కష్టపడి చదివి మంచి మార్కులు సాధించిన విద్యార్థులందరికీ మున్ముందు ఇలాంటి మంచి అనేక అవకాశాలు కల్పిస్తామని వీలైతే మన కళాశాలలో నే కంపెనీ ఇంటర్వ్యూలు నిర్వహింపజేసి చాలామందికి అవకాశం కల్పిస్తామని తెలియజేశారు.

అదేవిధంగా తమ కంపెనీలో మా విద్యార్థులకు అవకాశం కల్పించినందుకు కళాశాల ప్రిన్సిపల్ మరియు అధ్యాపక బృందం MSN కంపెనీ ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు

ఈ సందర్భంలో MSN కంపెనీలో జాబ్ సాధించడానికి మోటివేషన్ చేసి అన్ని విధాలుగా కృషి చేసిన ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక బృందానికి విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు.

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు