Bihar Teacher Recruitment – 1.78 లక్షల ఉద్యోగాలు

పాట్నా (జూన్ – 28) : బీహార్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో భారీ సంఖ్యలో భర్తీ చేయనున్న 1.78 లక్షల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి (Bihar Teacher Recruitment) అర్హత కలిగిన ఏ రాష్ట్రం వారైనా దరఖాస్తు చేసుకోవచ్చని నితీశ్ కుమార్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఖాళీలను భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసి ఏడాది చివరి నాటికి భర్తీ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉంది.

మంగళవారం నీతీశ్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో బిహార్ వాసులను మాత్రమే ఉపాధ్యాయులుగా నియమించుకొనేవారు. తాజాగా కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగ నియామకానికి నివాస ఆధారిత రిజర్వేషన్ ఏమీ ఉండదు.

ఈ రోజు రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో భారతీయ పౌరులు ఎవరైనా బిహార్ లోని 1.78 లక్షల ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.