కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 30% పీఆర్సీ అమలు

హైదరాబాద్ (జూలై – 23) : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజి బోర్డు (HMWSSB) లో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీ అమలు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తద్వారా దాదాపు నాలుగు వేల మంది వాటర్‌ బోర్డ్‌ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనున్నది.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజి బోర్డ్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేస్తూ నిర్ణయం తీసుకున్నందుకు మెట్రో వాటర్ వర్క్స్ యూనియన్ అధ్యక్షుడు జి.రాంబాబు యాదవ్, యూనియన్ నేతలు సీఎం కేసీఆర్ ను ప్రగతి భవన్ లో కలిసి ధన్యవాదాలు తెలిపారు.