BIKKI NEWS (JUNE 22) : US attacks Iran Nuclear sites says TRUMP. ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ పై దాడి చేశామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారిగా ప్రకటన చేశారు.
US attacks Iran Nuclear sites says TRUMP.
దీంతో ఇరాన్ ఇజ్రాయిల్ ఘర్షణల మధ్యలోకి మూడో దేశం ప్రవేశించినట్లయింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
తాము ఇరాన్ లోని మూడు అణు స్థావరాలపై విజయవంతంగా దాడులు చేసినట్లు ప్రకటించారు. ముఖ్యంగా ప్రధాన అణు స్థావరాలైన ఫోర్డో, నాటాంజ్ మరియు ఇస్పాహన్ అణు స్థావరాలపై దాడి చేసినట్లు తెలిపారు.
తమ దాడులు విజయవంతమయ్యయాని, యుద్ధ ళవిమానాల ద్వారా ఈ దాడులు చేసినట్లు, వారి విమానాలు తిరిగి సురక్షితంగా గమ్యస్థానానికి చేరాయని తెలిపారు. ఈ సందర్భంగా అమెరికా సైనికులకు శుభాకాంక్షలు చెప్పారు. ఇలాంటి దాడులను ఏ దేశం కూడా చేయలేదని తన మిలటరీని పొగుడుకున్నారు.
ఇప్పటికైనా మించి పోయింది లేదని ఇరాన్ శాంతి ఒప్పందానికి రావాలని ట్రంప్ పిలుపునిచ్చారు.
మరోవైపు ఇరాన్ లోని ఇస్పాహన్ అణు స్థావరంపై యురేనియం శుద్ధి ప్రక్రియలో ఉండగా దాడి చేసినట్లు ఇజ్రాయిల్ కూడా ప్రకటించింది.
- IND vs ENG DAY 2- ధీటుగా బదులిస్తున్న ఇంగ్లండ్
- US ATTACKS IRAN – యుద్దంలోకి అమెరికా – ట్రంప్
- DAILY GK BITS IN TELUGU JUNE 22nd
- చరిత్రలో ఈరోజు జూన్ 22
- World Rainforest Day – ప్రపంచ వర్షారణ్య దినోత్సవం