చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 28

★ దినోత్సవం

అంతర్జాతీయ సమాచార హక్కుల దినోత్సవం.
ప్రపంచ రేబీస్ దినోత్సవం
గన్నర్స్ డే
అంతర్జాతీయ సురక్షిత గర్భస్రావ దినోత్సవం
ప్రపంచ నదుల దినోత్సవం .(సెప్టెంబర్ నెల చివరి ఆదివారం)

★ సంఘటనలు

1745: బ్రిటన్ జాతీయ గీతం ‘గాడ్ సేవ్ ది కింగ్’ మొదటిసారిగా పాడిన రోజు.
1837: బహదూర్ షా- II సింహాసనాన్ని అధిష్టించాడు. అతని తండ్రి అక్బర్ షా- II మరణం తరువాత 62 సంవత్సరాల వయస్సులో ఢిల్లీ చక్రవర్తి అయ్యాడు.
1908: మూసీ నది వరదల వల్ల హైదరాబాదులో భారీగా ఆస్తినష్టం జరిగింది.
1924: ఢిల్లీలో జరుగుున్న అలర్లు ఆగలని ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు మహాత్మా గాంధీ.
1928: పెన్సిలిన్ను అనుకోకుండా అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనుగొన్నారు.
1954: హైదరాబాదు తూర్పు ప్రాంతంలో వరద దెబ్బతిన్న వంతెనపై నుంచి ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి 137 మంది మరణించారు
1984: తొలిసారి భారతదేశంలో ఫ్లడ్లైట్స్ క్రింద క్రికెట్ మ్యాచ్ జరిగింది. న్యూ ఢిల్లీలో ఆస్ట్రేలియా ఇండియా నడుమ జరిగిన మ్యాచ్ను ఫ్లడ్లైట్స్ క్రింద ఆడారు.
1985: భారతదేశంలో మొదటిసారి తెరచాప పడవలో భూగోళాన్ని చుట్టే గుఱితో భారతీయ సేన జట్టు బొంబాయి నుండి తృష్ణ అనే చిన్నోడలో బయలుదేరింది.(పూర్తి 10-1-87)
1993: కరకాస్ జాతీయ రహదారి క్రింద గ్యాస్ పైపు పేలి 58 మంది ప్రాణాలు కోల్పోయారు.
1996: ఆస్తుల కేసులో సుఖ్ రామ్ తీహార్ జైలుకు పంపబడ్డాడు.
2008: అమెరికా ప్రతినిధుల సభ భారత్-అమెరికా అణుఒప్పందపు బిల్లును ఆమోదించింది.
2013: పాలమూరు (మహబూబ్‌నగర్) పట్టణంలో సుష్మాస్వరాజ్ భారీ “తెలంగాణ ప్రజాగర్జన” బహిరంగ సభ నిర్వహించబడింది.
2016: యూరీలో ఆర్మీ శిబిరంపై ఉగ్రవాదులు దాడులు జరిపినందుకు పగసనదీర్పుగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై భారత వైమానిక దళం సర్జికల్ స్ట్రైక్-2 అనే దాడి జరిపింది.

★ జననాలు

0551 క్రీ.పూ.: కన్ఫ్యూషియస్, కన్ఫ్యూషియస్ మత స్థాపకుడు. (మ.0479 క్రీ.పూ.).
1835: షిర్డీ సాయిబాబా, భారతీయ గురువు, సాధువు, ఫకీరు. (మ.1918)
1895: గుర్రం జాషువా, ప తెలుగు కవి. (మ.1971)
1907: భగత్ సింగ్, భారత జాతీయోద్యమ నాయకుడు. (మ.1931)
1909: పైడి జైరాజ్, భారత సినీరంగ నటుడు, నిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (మ.2000)
1915: స్థానాపతి రుక్మిణమ్మ, సంస్కృతాంధ్ర పండితురాలు, రచయిత్రి.
1929: లతా మంగేష్కర్, గాన కోకిల. (మ. 2022)
1946: మాజిద్ ఖాన్, భారతీయ- పాకిస్థానీయ క్రికెటర్.
1965: కవిత , తెలుగు,తమిళ చిత్రాల నటి.
1966: పూరి జగన్నాథ్, ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత.
1969: వేణు మాధవ్ , తెలుగు సినీ నటుడు .(2019)
1982: అభినవ్ బింద్రా, తొలి వ్యక్తిగత ఒలింపిక్ బంగారు పతకాన్ని గెలుచుకున్న భారతీయ గురిపందెం ఆటగాడు.
1982: రణబీర్ కపూర్, హిందీ సినీ నటుడు, నిర్మాత.

★ మరణాలు

1895: లూయీ పాశ్చర్, ప్రఖ్యాత ఫ్రెంచి జీవశాస్త్రవేత్త. (జ.1822)
1940: పండిత్ సుందర్ లాల్ శర్మ, “ఛత్తీస్‌గఢ్ గాంధీ”, స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త (జ.1881)
1968: కూర్మాపు నరసింహం, చిత్రకారుడు.
1973: ఆదిరాజు వీరభద్రరావు, తెలంగాణ ప్రాంతపు చరిత్ర, సంస్కృతిపై విశేష పరిశోధన చేసిన గొప్ప భాషా శాస్త్రవేత్త. (జ.1890)
1980: రావాడ సత్యనారాయణ, తెలంగాణ రాష్ట్రానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త, ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్‌. (జ.1911)
1991: శంకర్ గుహ నియోగి, ఛత్తీస్గఢ్ కార్మికోద్యమ నాయకుడు.
1994: వెల్దుర్తి మాణిక్యరావు, నిజాం వ్యతిరేక పోరాటయోధుడు. (జ.1912)
2004: ముల్క్ రాజ్ ఆనంద్, భారతీయ ఆంగ్ల రచయిత. (జ.1905)
2006: ఎస్.వి.ఎల్.నరసింహారావు, న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1911)
2007: పీసపాటి నరసింహమూర్తి, రంగస్థల నటుడు. (జ.1920)