చరిత్రలో ఈరోజు ఆగస్టు 14

◆ సంఘటనలు

1862: బోంబే హైకోర్టు ప్రారంభం.
1947: భారత దేశ విభజన జరిగి పాకిస్తాన్ ఏర్పడింది.
2008 : ఆరవ వేతన సంఘం (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాల సవరణ కోసం వేసిన సంఘం) నివేదికను కేంద్ర ప్రభుత్వం చిన్న చిన్న మార్పులతో ఆమోదించింది.

◆ జననాలు

1895: మాగంటి బాపినీడు, స్వాతంత్ర్య సమరయోధుడు, తెలుగులో విజ్ఞాన సర్వస్వాన్ని ప్రచురించాడు.
1923: కులదీప్‌ నయ్యర్‌, భారతీయ జర్నలిస్టు, కాలమిస్టు, మానవ హక్కుల ఉద్యమకారుడు, రచయిత.
1927: మానాప్రగడ శేషసాయి, ఆకాశవాణి, దూరదర్శన్ వ్యాఖ్యాత.
1933: అక్కినేని అన్నపూర్ణ, తెలుగు సినిమా నటుడు అక్కినేని నాగేశ్వరరావు భార్య. (మ.2011)
1930: జాన నాగేశ్వరరావు, జనవాక్యం పత్రిక నడిపారు.
1946: పి.వి. రాజేశ్వర్ రావు: రాజకీయ నాయకుడు, మాజీ ఎంపి. (మ. 2016)
1957: జానీ లీవర్: భారతీయ సినీ హాస్యనటుడు.
1966: హాలీ బెర్రీ, అమెరికన్ నటి.
1968: ప్రవీణ్ ఆమ్రే, భారతదేశ క్రికెట్ క్రీడాకారుడు.

◆ మరణాలు

1910: గాదె చిన్నప్పరెడ్డి, స్వాతంత్ర్య సమరయోధుడు.
1958: ఫ్రెడెరిక్ జోలియట్ క్యూరీ, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1900)
1994: రాజశ్రీ, సినిమా పాటల రచయిత. (జ.1934)
2010: ఈడుపుగంటి వెంకట సుబ్బారావు, వ్యవసాయ శాస్త్రవేత్త. (జ.1934)
2011: షమ్మీ కపూర్, భారత సినీనటుడు, దర్శకుడు. (జ.1931)
2012: విలాస్‌రావు దేశ్‌ముఖ్, భారత రాజకీయవేత్త. (జ.1945)
2015: గోపరాజు లవణం, గోరా కుమారుడు, హేతువాది, నాస్తికుడు. (జ.1930)
2015: యోగానంద కృష్ణమూర్తి, ఆధ్యాత్మిక ప్రచారకుడు, గురువు. (జ.1931)