గురుకుల టీచర్ల క్రమబద్ధీకరణకు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ (ఆగస్టు – 25) : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లోని కాంట్రాక్ట్‌ ఉపాధ్యాయుల క్రమబద్దికరణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 567 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయుల రెగ్యులరైజ్ కానున్నారు. Telangana Gurukula teachers regularization

ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయనున్న ప్రభుత్వం. 16 సంవత్సరాలుగా కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగుతున్న ఉపాధ్యాయులు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం పట్ల రాష్ట్ర సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ హర్షం వ్యక్తం చేశారు