TS TET రాసేందుకు టీచర్లకు అనుమతి అవసరం లేదు

BIKKI NEWS (MARCH 28) : తెలంగాణ టెట్‌-2024 రాసేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యాశాఖ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని (NO PERMISSION REQUIRED FOR TEACHERS TO WRITE TET) విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన ఒక ప్రకటనలో తెలిపారు.

దీని కోసం వారు ఎలాంటి దరఖాస్తు చేసుకోవద్దని చెప్పారు. టెట్‌ రాసేందుకు ఉన్నతాధికారుల అనుమతి కోసం చాలా మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అనుమతి అవసరం లేదని కమిషనర్‌ స్పష్టం చేశారు.