BIKKI NEWS (MAY 08) : INDO PAK WAR 2025 LATEST UPDATES. ఈరోజు సాయంత్రం సరిహద్దు ప్రాంతాలపై పాకిస్తాన్ వరుస దాడులు ప్రారంభించిన నేపథ్యంలో భారత్ అదే రీతిలో వాటిని తిప్పి కొట్టిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైంది.
INDO PAK WAR 2025 LATEST UPDATES.
ఈ నేపథ్యంలో రక్షణ శాఖ మంత్రితో త్రివిధ దళాధిపతులు మరియు చీఫ్ డిఫెన్స్ సెక్రటరీ భేటీ అయ్యారు… అలాగే ప్రధాని నరేంద్ర మోడీతో అజిత్ దోవల్ భేటీ అయ్యారు. వీరి భేటీ నేపథ్యంలో త్రివిధ దళాలు ఒక్కసారిగా పాకిస్థాన్ పై దాడి చేయాలని వ్యూహం ఉన్నట్లు సమాచారం.
పాకిస్తాన్ తో ఎక్కువ కాలం యుద్ధం చేయడం, చిన్న చిన్న దాడులతో సరిపెట్టడం వలన లాభం లేదని భారత ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఒకేసారి దాడి చేసి పాకిస్థాన్ ని చిన్నా భిన్నం చేయడం ద్వారా యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించాలని భారత్ భావిస్తున్నట్లు సమాచారం.
అయితే భారత్ పై యుద్ధానికి తాము సిద్దంగా లేమని పాకిస్తాన్ తాజాగా ప్రకటించింది. ఇలా ప్రకటన వస్తున్న నేపథ్యంలోనే భారత పై వరుసగా క్షిపణులు, డ్రోన్ లతో దాడులు చేయడం, ఎఫ్ 16 వంటి అధునాతన యుద్ధ విమానాలను భారత భూభాగంలోకి పంపడం వంటి చర్యలను కూడా చేస్తుంది.
భారత్ ఇప్పటికే పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణులను, డ్రోన్లను మరియు ఎఫ్ 16 యుద్ధ విమానాన్ని కూల్చివేసింది.
- CURRENT AFFAIRS JUNE 29th 2025 – కరెంట్ అఫైర్స్
- వారికి ప్రతి సోమవారం ఎకౌంటు లోకి డబ్బులు
- IMPORTANT DAYS LIST IN JULY – జూలై ముఖ్య దినోత్సవాలు
- GOLD RATE – మళ్ళీ తగ్గిన బంగారం, వెండి ధరలు
- AP & TG – ఏపీ తెలంగాణలో పెరిగే శాసనసభ స్థానాల సంఖ్య