హైదరాబాద్ (ఆగస్టు – 31) : ఆసియా క్రికెట్ కప్ 1984 లో మొదటి సారి ప్రారంభమైంది. మొదటి టోర్నీ విజేతగా భారతదేశం నిలిచింది. రన్నరప్ గా నిలిచింది. ఆసియా ఖండపు దేశాలతో ఈ టోర్నమెంట్ నిర్వహింస్తారు. 1984 నుండి 2014 వరకు 12 సిరీస్ లను వన్డే పార్మాట్ లో , 2016 నుంచి టీట్వంటీ పార్మాట్ లో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం యూఏఈ లో జరుగుతున్న టోర్నీ 15వది… భారత్ గరిష్టంగా 7 సార్లు విజేతగా నిలిచింది. 2016, 2018 టీట్వంటీ పార్మాట్ లో జరగిన టోర్నీలలో భారత్ విజేతగా నిలిచింది. శ్రీలంక 5 సార్లు, పాకిస్థాన్ 2 సార్లు విజేతగా నిలిచాయి. ఎక్కువ పరుగులు సనత్ జయసూర్య (1220) పేరిట, ఎక్కువ వికెట్లు లసిత్ మలింగా (33) పేరిట ఉన్నాయి.
సంవత్సరం | విన్నర్ | రన్నర్ |
2022 | ? | ? |
2018 | భారత్ | బంగ్లాదేశ్ |
2016 | భారత్ | బంగ్లాదేశ్ |
2014 | శ్రీలంక | పాకిస్థాన్ |
2012 | పాకిస్థాన్ | బంగ్లాదేశ్ |
2010 | భారత్ | శ్రీలంక |
2008 | శ్రీలంక | భారత్ |
2004 | శ్రీలంక | భారత్ |
2000 | పాకిస్థాన్ | శ్రీలంక |
1997 | శ్రీలంక | భారత్ |
1995 | భారత్ | శ్రీలంక |
1990 | భారత్ | శ్రీలంక |
1988 | భారత్ | శ్రీలంక |
1986 | శ్రీలంక | పాకిస్థాన్ |
1984 | భారత్ | శ్రీలంక |