చరిత్రలో ఈరోజు జూలై 24

BIKKI NEWS : TODAY IN HISTORY JULY 24th

TODAY IN HISTORY JULY 24th

సంఘటనలు

1935: గ్రీటింగ్ టెలిగ్రాం పద్ధతిని మొట్టమొదటి సారిగా అమెరికాలో ప్రారంభించారు.
1958: మూడవ ఆసియా క్రీడలు జపాన్ రాజధాని నగరం టోక్యోలో ప్రారంభమయ్యాయి.
2022: నీరజ్ చోప్రా, ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 88.13 మీటర్ల త్రోతో రజత పతకాన్ని గెలుచుకున్నాడు.

జననాలు

1928: కేశూభాయి పటేల్, గుజరాత్ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకుడు.
1936: మొదలి నాగభూషణశర్మ, నటుడు, దర్శకుడు, నాటకకర్త, అధ్యాపకుడు, విమర్శకుడు, పరిశోధకుడు.
1976: కల్వకుంట్ల తారక రామారావు, సిరిసిల్ల శాసనసభ సభ్యుడు, మంత్రి.

మరణాలు

1862: మార్టిన్ వాన్ బురాన్, అమెరికా మాజీ అధ్యక్షుడు.
1899: సర్ ఆర్థర్ కాటన్, బ్రిటిషు సైనికాధికారి, నీటిపారుదల ఇంజనీరు. (జ.1803)
1970: కె.వి.రంగారెడ్డి, స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలితరం రాజకీయ నాయకుడు (జ.1890)
1971: గుర్రం జాషువా, తెలుగు కవి (జ.1895).
2000: ద్వారం భావనారాయణ రావు, వయొలిన్ విద్వాంసుడు, ద్వారం వెంకటస్వామి నాయుడు కుమారుడు (జ.1924)
2014: చేకూరి రామారావు, తెలుగు సాహిత్య విమర్శకుడు, భాషా శాస్త్రవేత్త (జ.1934)
2018: నిర్మలానంద, తెలుగు సాహితీవేత్త, అనువాదకుడు. ప్రజాసాహితి పత్రిక గౌరవ సంపాదకుడు. (జ.1935)
2022: రెడ్డి రాఘవయ్య, బాల సాహిత్యవేత్త (జ. 1940)

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు