చరిత్రలో ఈరోజు ఆగస్టు 27

◆ సంఘటనలు

1995 : ఈటీవీ తెలుగు ప్రసారాలు (టి.వి. ఛానెల్) ప్రారంభమయ్యాయి.
1955: గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మొదటి సంచిక ప్రచురించబడింది.
2003: దాదాపు గత 60, 000 సంవత్సరాలలో, అంగారక గ్రహం, భూమికి అతి దగ్గరగా వచ్చింది.

◆ జననాలు

1898: టి.ఎన్.రాజరత్నం పిళ్ళై, నాదస్వర విద్వాంసుడు. (మ.1956)
1908: డోనాల్డ్ బ్రాడ్‌మాన్, అద్భుతమైన సార్వకాలిక బ్యాట్స్‌మన్‌గా పేరు గాంచిన ఆస్ట్రేలియా క్రికెటర్. (మ.2001)
1908: లిండన్ బి జాన్సన్, రాజకీయవేత్త, రచయిత. (మ.1973)
1909: దాడి గోవిందరాజులు నాయుడు, తెలుగు, ఇంగ్లీష్, హిందీ నాటకాలలో స్త్రీ పురుష పాత్రధారి. (మ.1970)
1928: వోలేటి వెంకటేశ్వర్లు, సంగీత విద్వాంసుడు. (మ.1989)
1933: నాన్సీ ఫ్రైడే, స్త్రీ లైంగిక తత్వం, స్వేచ్ఛల పై పుస్తకాలని వ్రాసిన రచయిత్రి (మ.2017).
1955: వల్లూరు శివప్రసాద్, నాటకకర్త.
1957: నూతలపాటి వెంకటరమణ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి.
1963: సుమలత, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినిమా నటి.
1972: ఖలీ, భారతీయ మల్లయోధ నిపుణుడు, నటుడు.

◆ మరణాలు

1534: ఇస్మాయిల్ ఆదిల్‌షా, బీజాపూరు (1510 నుండి 1534 వరకు) సుల్తాను. (జ.1498)
1976: ముకేష్, భారతీయ హిందీ సినిమారంగ నేపథ్య గాయకుడు. (జ.1923)
2002: సింగరాజు రామకృష్ణయ్య, ఉపాధ్యాయుడు, ఏ.పి.టి.యఫ్ ప్రధాన కార్యదర్శి. (జ.1911) .
2006: హృషికేష్ ముఖర్జీ, భారతీయ చలనచిత్ర నిర్మాత, దర్శకుడు. (జ.1922)
2010: కంభంపాటి స్వయంప్రకాష్, ఆయుర్వేద వైద్యుడు, లైంగిక వ్యాధుల నిపుణుడు. (జ.1962)