చరిత్రలో ఈరోజు ఆగస్టు 11

◆ దినోత్సవం

  • చాద్ స్వాతంత్ర్యదినోత్సవము.

◆ సంఘటనలు

2008: బీజింగ్ ఒలింపిక్ క్రీడలలో అభినవ్ బింద్రా షూటింగ్‌ లో స్వర్ణపతకం సాధించాడు. వ్యక్తిగత విభాగంలో స్వర్ణపతకం రావడం భారత్‌కు ఇదే తొలిసారి
2010: విశాఖపట్నం బార్ అసోసియేషన్ కి 2010-11 సంవత్సరానికి, బుధవారం ఎన్నికలు జరిగాయి.
2013: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడి యొక్క నవభారత యువభేరీ సదస్సు హైదరాబాదులో జరిగింది.

◆ జననాలు

1926: ఎక్కిరాల కృష్ణమాచార్య, రచయిత, హోమియో వైద్యుడు (మ.1984).
1949: దువ్వూరి సుబ్బారావు, ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించాడు, భారతదేశపు కేంద్రబ్యాంకు అయిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా (2008 – 2013) పనిచేశాడు.
1950: మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, కృష్ణా జిల్లాకు చెందిన వై.ఎస్.ఆర్ పార్టీ నాయకుడు, నూజివీడు శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యుడు.

◆ మరణాలు

1908: ఖుదీరాం బోస్, భారతీయ స్వాతంత్ర్య సమర వీరులలో మొదటితరానికి చెందిన అతిపిన్నవయస్కుడు (జ.1889).
1946: బత్తిని మొగిలయ్య గౌడ్, తెలంగాణ విమోచనోద్యమ నాయకుడు, వరంగల్లులో రజాకార్ల దాష్టీకాలతో హత్య చేయబడ్డాడు (జ.1918).
1962: పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి, రచయిత, సాహితీకారుడు (జ.1900).
2000: పైడి జైరాజ్, భారత సినీరంగంలో నటుడు, నిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత (జ.1909).
2012: భద్రిరాజు కృష్ణమూర్తి, ద్రావిడ భాషా పరిశోధకుడు, భాషాశాస్త్ర అధ్యాపకుడు (జ.1928).
2016: యాదాటి కాశీపతి, అనంతపురం జిల్లాకు చెందిన పాత్రికేయుడు, రచయిత.
2016: ఇచ్ఛాపురపు రామచంద్రం, కథారచయిత. బాల సాహిత్య రచయిత. (జ.1940).
2018: విద్యాధర్ సూరజ్ ప్రసాద్ నైపాల్, భారత సంతతికి చెందిన వ్యక్తి, సాహిత్యంలో నోబెల్ బహుమతి గ్రహిత (జ. 1932).