DSC 2024 అభ్యర్థులకు ఆ అవకాశం

BIKKI NEWS (JULY 13) : TG DSC HALL TICKETS FOR ONE CENTER. తెలంగాణ రాష్ట్ర డీఎస్సీ 2024 పరీక్షలు రాసే అభ్యర్థులకు విద్యాశాఖ శుభవార్త చెప్పింది. రెండు వేరువేరు సెంటర్లలో ఒకేరోజు పరీక్షలు ఉన్న అభ్యర్థులు ఉదయం పరీక్ష రాసిన సెంటర్లోని మధ్యాహ్నం పరీక్ష రాసే అవకాశాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఉదయం రాసే పరీక్ష ఒక సెంటర్లో ఉండగా, మధ్యాహ్నం రాసే పరీక్ష మరొక సెంటర్లో ఉండడంతో అభ్యర్థులు తీవ్రంగా ఇబ్బంది పడే అవకాశం ఉండడం.. లేదా అభ్యర్థులు పూర్తిగా మధ్యాహ్నం రాసే పరీక్షకు హాజరు అయ్యే అవకాశాలు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

చాలామంది అభ్యర్థులు నాన్ లోకల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడంతో వేరే జిల్లాలో పరీక్షకు హాజరు కావలసి ఉంటుంది. మధ్యాహ్నం రాసే పరీక్ష సొంత జిల్లాలో ఉండడంతో రవాణా సమయం వలన పరీక్షకు హాజరు కాలేకపోవచ్చు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు విద్యాశాఖకు ఒకే సెంటర్లో పరీక్ష రాసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ నేపథ్యంలో విద్యాశాఖ ఒకేరోజు వేరువేరు సెంటర్లలో పరీక్ష రాసే అభ్యర్థులకు, నూతనంగా హాల్ టికెట్లను జారీ చేయనుంది. వీటిని త్వరలోనే వెబ్సైట్లో అందుబాటులో ఉంచనుంది. కావున వేరువేరు పరీక్షలకు దరఖాస్తు చూసుకున్న అభ్యర్థులు పరీక్షకు ముందు మరోసారి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుంటే ఒకే సెంటర్లో రెండు పరీక్షలు రాసే అవకాశం ఉంటుంది.

జూలై 18 నుండి ఆగస్టు 5వ తేదీ వరకు డీఎస్సీ రాత పరీక్షలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే.

DOWNLOAD TG DSC 2024 HALL TICKETS HERE

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు