TS PRC 2 నియామకం, 5 శాతమే ఐఆర్

హైదరాబాద్ (అక్టోబర్ – 02) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పే స్కేల్ చెల్లింపుకోసం పే రివిజన్ కమిటీని ( TELANGANA 2nd PRC) నియమించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు నిర్ణయించారు. ఈ మేరకు కమిటీ చైర్మన్ గా ఎన్. శివశంకర్ (రిటైర్డ్ ఐఎఎస్) ను , సభ్యునిగా బి. రామయ్య (రిటైర్డ్ ఐఎఎస్) ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

కమిటీ 6 నెల్లలోపు నివేదికను ప్రభుత్వానికి అంద చేయాలని ఉత్తర్వుల్లో సూచించింది. పీఆర్సీ కి బాధ్యతలు నిర్వర్తించేందుకు కావాల్సిన నిధులను, స్టాఫ్ ను ఏర్పాటు చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించింది.

5 శాతం మధ్యంతర భృతి (5 % IR FOR EMPLOYEES ) ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫస్ట్ అక్టోబర్ 2023 నుంచి అయ్యార్ అమలు కానుంది