BIKKI NEWS (JUNE 04) : తెలంగాణ రాష్ట్రంలో నిలిచిపోయిన టీచర్ల బదిలీలు, పదోన్నతులను జూన్ 7 నుంచి ప్రారంభించనున్నట్టు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం తెలిపారు. జూన్ 7 నుంచి 20 వరకు బదిలీల, పదోన్నతుల ప్రక్రియను (teachers transfers and promotions from June 7th) చేపడతామని పేర్కొన్నారు.
ఈ బదిలీల, పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్ను రెండు రోజుల్లో విడుదల చేస్తామని చెప్పారు.
ఈ పదోన్నతుల ద్వారా దాదాపుగా 5,563 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు లభించనున్నాయి.