- తెలంగాణ విద్యా కమిషన్ కు TGJLA_475 సంఘం రిపోర్టు
BIKKI NEWS (JUNE 11) : protect inter education system from corporate system .తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యలో కీలకంగా ఉన్న ఇంటర్ విద్యను, కార్పొరేట్ శక్తుల నుంచి కాపాడాలని అందరికీ ఇంటర్ విద్య అందేటట్లు ప్రభుత్వ జూనియర్ కళాశాలలను పటిష్టం చేయాలని ఈరోజు తెలంగాణ విద్యా కమిషన్ కు తమ సంఘం నుంచి రిపోర్టు అందజేసినట్లు తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ – 475 రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ వి. శ్రీనివాస్, డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ లు తెలిపారు.
protect inter education system from corporate system
ఈరోజు హైదరాబాదులో తెలంగాణ విద్యా కమిషన్ ఆఫీసులో తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ శ్రీ ఆకునూరు మురళి IAS గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ విద్యపై ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా నిర్వహించిన సమావేశంలో, తమ సంఘము పాల్గొంటూ, అనేక సూచనలు అందజేసినట్లు తెలుపింది
1969 లో 10+2+3 విధానములో భాగంగా ఉమ్మడి రాష్ట్రంలో ఇంటర్ విద్యా వ్యవస్థ ప్రారంభించడం జరిగిందని, ఇంటర్ విద్యా వ్యవస్థలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివిన అనేకమంది అనేక ఉన్నత స్థానాలు పొందడం జరిగిందని తెలుపుతూ… క్రమేపి ప్రభుత్వ విధానాల వల్ల ప్రైవేటు, కార్పొరేట్ శక్తులు ఇంటర్ విద్యను వ్యాపార వస్తువుగా మార్చుకున్నారని తెలిపారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో గత విద్యా సంవత్సరంలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు
9,97,012 వార్షిక పరీక్షలు రాయడం జరిగిందని తెలిపారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వివిధ మేనేజ్మెంట్ లో 3,019 కళాశాలలు ఉన్నాయని తెలిపారు. ఇందులో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రస్తుతం 440 ఉన్నాయని తెలిపారు.
కార్పొరేట్ కళాశాలు తమ అబద్ధపు ,ప్రచార ప్రకటనలతో తెలంగాణ రాష్ట్రంలోని సామాన్య, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులను ఆకర్షించి అత్యధిక ఫీజులు పొందుతూ తప్పుడు ప్రకటన చేస్తున్నారని తెలిపారు.
చాలామంది తల్లిదండ్రులు అప్పులు చేసి వీటిలో అడ్మిషన్లు చేరుస్తున్నారని తెలిపారు. విద్యార్థులపై ఒత్తిడితో అనేకమంది ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయని తెలిపారు. వీటిని కట్టడి చేయకపోతే విద్యా వ్యవస్థ నాశనం అవుతుందని తెలిపారు.
రాష్ట్ర బడ్జెట్ లో 15% నిధులను ప్రభుత్వ విద్యా వ్యవస్థ గురించి కేటాయించాలని కోరారు.
అదేవిధంగా ప్రభుత్వ ఉన్నత విద్యలో కీలకమైన ఇంటర్ విద్యా వ్యవస్థలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తమ శక్తి మేరకు కృషి చేస్తున్నప్పటికీ, అనేక వ్యవస్థకరమైన పరమైన ఇబ్బందుల వలన ముందుకు వెళ్లలేకపోతున్నాయని తెలిపారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ సూచనలు అందజేయడం జరిగింది.
కార్పొరేట్ కళాశాలలో విద్యార్థుల ఆత్మహత్యపై కార్పొరేట్ కళాశాలల గురించి గత ప్రభుత్వ నియమించిన ప్రొఫెసర్ నీరజా రెడ్డి కమిటీ రిపోర్ట్ ని బహిర్గతం చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.
హైదరాబాదులో ఇంటర్ విద్య పై ఏర్పాటు చేసిన ప్రజా అభిప్రాయ సేకరణ లాగా తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల్లో కూడా ఇంటర్ విద్యపై ప్రజా అభిప్రాయ సేకరణ చేయాలని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అనేక విద్యార్థి సంఘాలు, అధ్యాపక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ శ్రీ ఆకునూరు మురళి గారికి, విద్యా కమిషన్ సభ్యులకు తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ -475 నుంచి రిపోర్టు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డాక్టర్ వి. శ్రీనివాస్, డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ , రాష్ట్ర నాయకులు ఎం. వెంకట ముత్యం, సంగీత, షాహినా బేగం, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
- INTER RV – RC – ఇంటర్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ అవకాశం
- Aada bidda nidhi – త్వరలోనే మహిళలకు 1500/- పథకం
- INTER SUPPLEMENTARY RESULTS – నేడే ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు
- GOLD RATE – తగ్గిన బంగారం ధర
- Jobs – రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో జాబ్స్