JEE MAIN ఫలితాలు 25న

BIKKI NEWS (APRIL 12) : JEE MAIN 2 RESULTS ON 25th April. జేఈఈ మెయిన్‌ సెషన్ 2 ఫలితాలను ఎప్రిల్ 25న విడుదల చేయనున్నట్లు జాతీయ పరీక్షల సంస్థ వెల్లడించింది. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష మాత్రం యథాతథంగా మే 26న జరుగుతుందని ప్రకటించింది.

ఈ నేపథ్యంలోనే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తుల ప్రక్రియ తేదీల్లో ఐఐటీ మద్రాస్‌ మార్పు చేసింది. ఎప్రిల్ 27 నుంచి మే 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తులు స్వీకరించేలా షెడ్యూల్‌లో మార్పు చేసింది.

జేఈఈ మెయిన్‌లో కనీస మార్కులు సాధించిన 2.50 లక్షల మందికి మాత్రమే ఐఐటీల్లో బీటెక్‌లో చేరేందుకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసే అవకాశం కల్పిస్తారు. ఈసారి అడ్వాన్స్‌డ్‌ పరీక్షను ఐఐటీ మద్రాస్‌ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.