GURUKULA JOBS – మార్చి 4న గురుకుల నియామక పత్రాలు అందజేత

BIKKI NEWS (MARCH. 1) : తెలంగాణ గురుకుల విద్యాలయ సంస్థల్లో డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, టీజీటీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను మార్చి 4వ తేదీన హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా (Gurukuka DL JL TGT appointment orders on 4th march) అందజేయనున్నట్లు సమాచారం.

ఇప్పటికే డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ తుది ఫలితాలను సబ్జెక్టుల వారీగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. రెండు రోజుల్లో టీజీటీ తుది ఫలితాలను కూడా విడుదల చేసి మార్చి 4వ తేదీన నియామక పత్రాలు అందజేయనున్నారు.

793 డిగ్రీ లెక్చరర్, 1,924 జూనియర్ లెక్చరర్, 4,006 టీజీటీ పోస్టులను ఈ నోటిఫికేషన్ ల ద్వారా భర్తీ చేయనున్నారు. మొత్తం 6,723 మందికి నియామక పత్రాలు అందజేయనున్నారు.