నూతన డీఐఈవో ను సన్మానించిన అతిథి అధ్యాపకులు

BIKKI NEWS (JUNE 02) : Guest faculty felicitated Siddipet new DIEO. సిద్దిపేట జిల్లా నూతన DIEO గా పదవీ బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి శ్రీ హిమబిందు మేడమ్ గారిని ప్రభుత్వ జూనియర్ కళాశాలల గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ సిద్దిపేట జిల్లా విభాగం తరపున DIEO ఆఫీస్, కలెక్టరేట్ సిద్దిపేట నందు ఘనంగా సన్మానించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో అసోసియేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ చెరుకు దేవయ్య సిద్దిపేట జిల్లా ప్రెసిడెంట్ జల్లా విజయ్, వైస్ ప్రెసిడెంట్ బాల్ లింగం, స్పోక్ పర్సన్ అజీమ్, గౌరవ సభ్యులు రేవంత్, అశోక్, రమణాచారి మరియు ఉజ్మా మేడం పాల్గొనడం జరిగింది.

ఈ సందర్భంగా DIEO మేడం మాట్లాడుతూ… ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పని చేస్తున్న గెస్ట్ లెక్చరర్స్ సమస్యలు తమకు తెలుసునని మున్ముందు మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మీకు జరగాల్సిన న్యాయం చేస్తానని తెలిపారు. అలాగే మన సిద్దిపేట జిల్లాలో అందరం కలిసికట్టుగా పని చేసి మన జిల్లాను రాష్ట్ర స్థాయిలో ముందుంచుదామని తెలియజేశారు.

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు