BIKKI NEWS (JULY 23) : UNION BUDGET 2024 IMPORTANT POINTS. కేంద్ర బడ్జెట్ 2024 ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు.
కేంద్ర బడ్జెట్ లో ప్రవేశ పెట్టిన వివిధ పథకాలు, వివిధ రంగాలకు కేటాయించిన నిధుల వివరాలు బడ్జెట్ సమగ్ర రూపాన్ని మీకోసం…
UNION BUDGET 2024 IMPORTANT POINTS
- కేంద్ర బడ్జెట్ 2024-25లో మొత్తం రూ.48,20,512 కోట్లు వ్యయం అంచనా వేశారు.
- మూలధన వ్యయం రూ.11,11,111 కోట్లు. ఇది 2023-24 అంచనాల కంటే 16.9% ఎక్కువ.
- ప్రభావవంతమైన మూలధన వ్యయం రూ.15,01,889 కోట్లుగా అంచనా.
- నికర పన్ను ఆదాయం రూ.25,83,499 కోట్లు.
- పన్నేతర ఆదాయం రూ.5,45,701 కోట్లు.
- మొత్తం మూలధన వసూళ్లు (రుణేతర రశీదులు, రుణ రసీదులతో కలిపి) రూ.15,50,915 కోట్లు.
UNION BUDGET IMPORTANT UPDATES
- యువతకు నైపుణ్యాలు పెంచే బడ్జెట్: మోదీ
- మహిళల స్వావలంబనకు దోహదం చేసే బడ్జెట్.
- ముద్ర రుణాల పరిమితిని రూ.20 లక్షలకు పెంచాం.
- ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యమిచ్చాం.
- భారత్ను గ్లోబల్ మ్యానుఫాక్చరింగ్ హబ్గా మారుస్తాం.
- పర్యాటక రంగాన్ని మరింత మెరుగుపరిచేలా చర్యలు తీసుకున్నాం.
- స్టాంప్ డ్యూటీ పెంచేందుకు రాష్ట్రాలకు అనుమతి.
- పన్ను సమస్యలకు సంబంధించిన అప్పీళ్ల ద్రవ్య పరిమితులు పెంచారు.
- ట్యాక్స్ ట్రిబ్యునల్స్, హైకోర్టులు, సుప్రీంకోర్టులో ప్రత్యక్ష పన్నులు, ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్కు సంబంధించిన అప్పీళ్లను దాఖలు చేయడానికి ద్రవ్య పరిమితులు వరుసగా రూ.60 లక్షలు, రూ.2 కోట్లు, రూ.5 కోట్లుగా నిర్ణయించారు.
- గత సంవత్సరం కంటే బడ్జెట్ కేటాయింపులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కు నిధులు తగ్గించారు. 2024-25 బడ్జెట్లో రూ.951 కోట్లు కేటాయించారు. గతేడాది కేటాయించిన రూ.968 కోట్లు కంటే 1.79 శాతం నిధులు తగ్గాయి.
- జమ్మూ కశ్మీర్కు బడ్జెట్లో రూ.42,277 కోట్లు.
- అండమాన్ నికోబార్ దీవులకు రూ.5,985 కోట్లు.
- చండీగడ్క రూ.5,862 కోట్లు.
- లద్దాఖకు రూ.5,958 కోట్లు.
- ప్రభుత్వం మూడు క్యాన్సర్ మందులను కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయించింది.
- విదేశీ కంపెనీలపై కార్పొరేట్ పన్ను రేటు 40% నుంచి 35%కి తగ్గించింది.
- క్యాపిటల్ గెయిన్లపై ప్రభుత్వం పన్ను పెంచిన తర్వాత రూపాయి రికార్డు స్థాయికి క్షీణించింది.
- యూఎస్ డాలర్తో పోలిస్తే రూపాయి 83.69కి పడిపోయింది.
- ఎంపిక చేసిన నగరాల్లో 100 స్ట్రీట్ ఫుడ్ హబ్ల అభివృద్ధి.
- 30 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న 14 పెద్ద నగరాల కోసం రవాణా ఆధారిత అభివృద్ధి ప్రణాళికలు.
ప్రధాన కేంద్ర పథకాలకు కేటాయింపులు..
- గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.86 వేలకోట్లు.
- రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లకు రూ.1,200 కోట్లు.
- న్యూ క్లియర్ ప్రాజెక్ట్లకు రూ.2,228 కోట్లు.
- ఫార్మాసూటికల్స్ రంగంలో పీఎస్ఐ పథకానికి రూ.2,143 కోట్లు.
- సెమీకండక్టర్లు అభివృద్ధికి, తయారీ రంగానికి రూ.6,903 కోట్లు.
- సోలార్ పవర్ (గ్రిడ్) రూ.10 వేలకోట్లు.
- ఎల్పీజీ డీబీటీ(రాయితీ)లకు 1,500 కోట్లు.
రూపాయి రాక…
- ఇన్కమ్ ట్యాక్స్ 19 పైసలు
- ఎక్సైజ్ డ్యూటీ 5 పైసలు
- అప్పులు, ఆస్తులు 27 పైసలు
- పన్నేతర ఆదాయం 9 పైసలు
- మూలధన రశీదులు 1 పైసలు
- కస్టమ్స్ ఆదాయం 4 పైసలు
- కార్పొరేషన్ ట్యాక్స్ 17 పైసలు
- జీఎస్టీ, ఇతర పన్నులు 18 పైసలు
రూపాయి పోక..
- పెన్షన్లు 4 పైసలు
- వడ్డీ చెల్లింపులు 19 పైసలు
- కేంద్ర పథకాలు 16 పైసలు
- సబ్సిడీలు 6 పైసలు
- డిఫెన్స్ 8 పైసలు
- రాష్ట్రాలకు తిరిగి చెల్లించే ట్యాక్స్లు 21 పైసలు
- ఫైనాన్స్ కమిషన్కు చెల్లింపులు 9 పైసలు
- కేంద్ర ప్రాయోజిక పథకాలు 8 పైసలు
- ఇతర ఖర్చులు 9 పైసలు
- డిఫెన్స్ 8 పైసలు
- రాష్ట్రాలకు తిరిగి చెల్లించే ట్యాక్స్లు 21 పైసలు
- ఫైనాన్స్ కమిషన్కు చెల్లింపులు 9 పైసలు
- కేంద్ర ప్రాయోజిక పథకాలు 8 పైసలు
- ఇతర ఖర్చులు 9 పైసలు
ఆదాయ పన్ను విధానం
- కొత్త పన్ను విధానంలో మార్పులు.. రూ.3 లక్షలలోపు ఎలాంటి పన్ను లేదు.
- రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షలలోపు 5 శాతం,
- రూ. 7 లక్షలు- రూ.10 లక్షలలోపు 10%,
- రూ. 10లక్షలు- రూ.12 లక్షలలోపు 15%,
- రూ.12 లక్షలు-రూ.15 లక్షలలోపు 20%,
- రూ.15 లక్షలు అంతకంటే ఎక్కువ ఉంటే 30% పన్ను చెల్లించాలి.
- మొత్తంగా పన్నుదారులు రూ.17,500 మిగుల్చుకునే అవకాశం.
- పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000 నుంచి రూ.75,000కి పెంపు.
- ట్రేడింగ్ మార్కెట్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్లపై ఎన్టీటీ వరుసగా 0.02%, 0.01%కి పెంపు.
- దీర్ఘకాలిక మూలధన లాభాలపై 12.5 శాతం పన్ను.
- క్యాపిటల్ కనిష్ఠ పరిమితి రూ.1.25 లక్షలు.
- స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహకం.. ఏంజెల్ ట్యాక్స్ రద్దు.
- బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకం 6 శాతం, ప్లాటినంపై 6.4 శాతం తగ్గింపు.
- మొబైల్, యాక్ససరీస్ పై 15 శాతం దిగుమతి సుంకం తగ్గింపు.
జీఎస్టీలో పన్నుల నిర్మాణాన్ని హేతుబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. సామాన్యులకు జీఎస్టీ వల్ల గణనీయంగా లాభం చేకూరింది. జీఎస్టీ ప్రయోజనాలను మరింత మెరుగుపరచడానికి పన్ను నిర్మాణంపై నిర్ణయం తీసుకునేందుకు ప్రయత్నిస్తాం.
ఆర్థిక ద్రవ్యలోటు జీడీపీలో 4.9%గా ఉంది.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్ఎఐ)ను పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది..
కాశీ విశ్వనాథ్ ఆలయం, నలంద, విష్ణుపాద్, మహాబోధి ఆలయం వంటి ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి ప్రత్యేక కారిడార్ల ఏర్పాటు.
- రాబోయే 10 సంవత్సరాలలో అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను ఐదు రెట్లు విస్తరిస్తాం.
- ఈ లక్ష్యానికి చేరుకోవడానికి రూ.1,000 కోట్ల క్యాపిటల్ ఫండ్ ఏర్పాటు చేస్తాం.
- ‘ఫిబ్రవరిలో ప్రకటించిన విధంగా రూ.1 లక్ష కోట్ల ఫండ్తో ప్రైవేట్ ఆధారిత పరిశోధనలను ప్రోత్సహించడానికి ఒక యంత్రాంగాన్ని రూపొందిస్తాం.
- చిన్న, మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్ల అభివృద్ధి.
- ఇందుకు ప్రభుత్వం ప్రైవేట్ రంగంతో కలిసి పనిచేస్తుంది. న్యూక్లియర్ ఎనర్జీ కోసం కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేయాల్సి ఉంది.
- నేపాల్లో వరదలను నియంత్రించేలా మరిన్ని నిర్మాణాలు చేపట్టాలి. అసోం, బీహార్ లోనూ తరచు వరదలు సంభవిస్తాయి. వరదల వల్ల హిమాచల్ ప్రదేశ్ తీవ్రంగా నష్టపోతుంది. కొండచరియలు విరిగిపడటం వంటి విపత్తుల నిర్వహణకు రూ.11,500 కోట్లు ఆర్థికసాయం.
- ప్రధానమంత్రి సూర్య మర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకానికి సంబంధించి విధాన పత్రాన్ని విడుదల చేస్తాం. ఈ పథకాన్ని రూప్టాప్ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ప్రారంభించారు. దీని ద్వారా 1 కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందిస్తారు. ఇప్పటికే 1.28 కోట్ల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. 14 లక్షల దరఖాస్తులు అందాయి.
- మౌలిక సదుపాయాలకు రూ.11.11 లక్షల కోట్లు,
- ఇది జీడీపీలో 3.4 శాతానికి సమానం,
- రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్లకు రూ.26,000 కోట్ల ప్రోత్సాహం,
- గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు.
- ‘ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ (ఐబీసీ) పరిధిలో బ్యాంక్ రుణాల రికవరీని మెరుగుపరచడానికి ఇంటిగ్రేటెడ్ టెక్ ప్లాట్ఫామ్ ఏర్పాటు.
- ముద్ర రుణాలు రూ. 10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంపు,
- ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారెంట్ స్కీం.
- సులభంగా నిధులు అందేలా చర్యలు.
- గంగానదిపై మరో రెండు వంతెనల ఏర్పాటు.
- ఈశాన్యరాష్ట్రాల్లో ఎక్స్ప్రెస్ హైవేల నిర్మాణం.
- ఈశాన్యరాష్ట్రాల్లో 100 పోస్ట్పెమెంట్ బ్యాంకుల ఏర్పాటు.
- కొత్త పన్ను విధానంలో మార్పులు.. రూ.3 లక్షలలోపు ఎలాంటి పన్ను లేదు. రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షలలోపు 5 శాతం, రూ.7లక్షలు- రూ.10 లక్షలలోపు 10%, రూ.10లక్షలు- రూ.12 లక్షలలోపు 15%, రూ.12 లక్షలు-రూ.15 లక్షలలోపు 20%, రూ.15 లక్షలు అంతకంటే ఎక్కువ ఉంటే 30% పన్ను చెల్లించాలి. మొత్తంగా పన్నుదారులు రూ.17,500 మిగుల్చుకునే అవకాశం.
- పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000 నుంచి రూ.75,000కి పెంపు.
- ట్రేడింగ్ మార్కెట్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్లపై ఎన్టీటీ వరుసగా 0.02%, 0.01%కి పెంపు.
- దీర్ఘకాలిక మూలధన లాభాలపై 12.5 శాతం పన్ను.
- క్యాపిటల్ కనిష్ఠ పరిమితి రూ.1.25 లక్షలు.
- స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహకం.. ఏంజెల్ ట్యాక్స్ రద్దు.
- బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకం 6 శాతం, ప్లాటినంపై 6.4 శాతం తగ్గింపు.
- మొబైల్, యాక్ససరీస్ పై 15 శాతం దిగుమతి సుంకం తగ్గింపు.
- జీఎస్టీలో పన్నుల నిర్మాణాన్ని హేతుబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. సామాన్యులకు జీఎస్టీ వల్ల గణనీయంగా లాభం చేకూరింది. జీఎస్టీ ప్రయోజనాలను మరింత మెరుగుపరచడానికి పన్ను నిర్మాణంపై నిర్ణయం తీసుకునేందుకు ప్రయత్నిస్తాం.
- ఆర్థిక ద్రవ్యలోటు జీడీపీలో 4.9%గా ఉంది.
- విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్ఎఐ)ను పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
- కాశీ విశ్వనాథ్ ఆలయం, నలంద, విష్ణుపాద్, మహాబోధి ఆలయం వంటి ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి ప్రత్యేక కారిడార్ల
- ఏర్పాటు.
- రాబోయే 10 సంవత్సరాలలో అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను ఐదు రెట్లు విస్తరిస్తాం.
- ఈ లక్ష్యానికి చేరుకోవడానికి రూ.1,000 కోట్ల క్యాపిటల్ ఫండ్ ఏర్పాటు చేస్తాం.
- ఫిబ్రవరిలో ప్రకటించిన విధంగా రూ.1 లక్ష కోట్ల ఫండ్తో ప్రైవేట్ ఆధారిత పరిశోధనలను ప్రోత్సహించడానికి ఒక యంత్రాంగాన్ని రూపొందిస్తాం.
- చిన్న, మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్ల అభివృద్ధి.
- ఇందుకు ప్రభుత్వం ప్రైవేట్ రంగంతో కలిసి పనిచేస్తుంది. న్యూక్లియర్ ఎనర్జీ కోసం కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేయాల్సి ఉంది.
- నేపాల్లో వరదలను నియంత్రించేలా మరిన్ని నిర్మాణాలు చేపట్టాలి. అసోం, బీహార్ లోనూ తరచు వరదలు సంభవిస్తాయి. వరదల వల్ల హిమాచల్ ప్రదేశ్ తీవ్రంగా నష్టపోతుంది. కొండచరియలు విరిగిపడటం వంటి విపత్తుల నిర్వహణకు రూ.11,500 కోట్లు ఆర్థికసాయం.
- ప్రధానమంత్రి సూర్య షుర్ ముఫ్ బిజిలీ యోజన పథకానికి సంబంధించి విధాన పత్రాన్ని విడుదల చేస్తాం. ఈ పథకాన్ని రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ప్రారంభించారు. దీని ద్వారా 1 కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందిస్తారు. ఇప్పటికే 1.28 కోట్ల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. 14 లక్షల దరఖాస్తులు అందాయి.
- మౌలిక సదుపాయాలకు రూ.11.11 లక్షల కోట్లు.
- ఇది జీడీపీలో 3.4 శాతానికి సమానం.
- రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్లకు రూ.26,000 కోట్ల ప్రోత్సాహం.
- గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు.
- ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ (ఐబీసీ) పరిధిలో బ్యాంక్ రుణాల రికవరీని మెరుగుపరచడానికి ఇంటిగ్రేటెడ్ టెక్ ప్లాట్ఫామ్ ఏర్పాటు.
- ముద్ర రుణాలు రూ. 10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంపు.
- ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారెంట్ స్కీం.
- సులభంగా నిధులు అందేలా చర్యలు.
- గంగానదిపై మరో రెండు వంతెనల ఏర్పాటు.
- ఈశాన్యరాష్ట్రాల్లో ఎక్స్ప్రెస్ హైవేల నిర్మాణం.
- ఈశాన్యరాష్ట్రాల్లో 100 పోస్టేపేమెంట్ బ్యాంకుల ఏర్పాటు.
- దేశవ్యాప్తంగా 12 ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు.
- బీహార్ లో ఎక్స్ప్రెస్ హైవేలు నిర్మాణం.
- బీహార్, ఏపీలోనూ పూర్వోదయ పథకం అమలు.
- ఏటా 10 లక్షల మందికి విద్యారుణం.
- విద్యా, నైపుణ్యాభివృద్ధికి రూ.1.48 లక్షల కోట్లు.
- వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్లు.
- మహిళల నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు.
- కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారికి ఈపీఎఫ్ పథకం.
- ఈపీఎఫ్ ద్వారా నగదు బదిలీ.
- వర్కింగ్ ఉమెన్ హాస్టళ్ల ఏర్పాటు.
- నాలుగు కోట్ల మందికి స్కిల్ పాలసీ.
- ఈ బడ్జెట్లో వికసిత్ భారత్కు రోడ్ మ్యాప్.
- సమ్మిళిత అభివృద్ధికి పెద్దపేట.
- యువతకు ఐదు ఉద్యోగ పథకాలు.
- నాలుగు కోట్ల యువతకు ఉపాధి కల్పించేలా కృషి.
- వ్యవసాయం డిజిటలైజేషన్ కోసం ప్రత్యేక కార్యక్రమం.
- ఉద్యోగాల కల్పన, నైపుణ్యాల సృష్టి, సంస్థల ఏర్పాటుకు బడ్జెట్లో నిర్ణయాలు.
- కూరగాయల ఉత్పత్తి, సరఫరాలకు ప్రత్యేక చర్యలు.
- ప్రధానమంత్రి అన్నయోజన పథకాన్ని ఐదేళ్లు పొడిగించాం.
- ప్రధానిగా నరేంద్రమోదీ మూడోసారి చరిత్రాత్మక విజయం సాధించారు.
- ప్రజల ఆంకాక్షలు నెరవేర్చడంలో ఈ విజయం సాధ్యమైంది.
- దేశవ్యాప్తంగా మద్దతు ధరలు పెంచాం.
- అంతర్జాతీయ అనిశ్చితుల వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతున్నా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల స్థిరాభివృద్ధి సాధ్యమవుతుంది: నిర్మలా సీతారామన్
- పార్లమెంట్లో బడ్జెట్ 2024-25ను విడుదల చేయనున్న నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్రమోదీ లోక్సభకు చేరుకున్నారు.
- బడ్జెట్ 2024-25 పత్రాలను ‘యూనియన్ బడ్జెట్’ మొబైల్ యాప్ ఉపయోగించి పొందవచ్చు. ఈ యాప్ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ఫామ్ లేదా యూనియన్ బడ్జెట్ వెబ్ పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పత్రాలు ఇంగ్లీష్, హిందీలో అందుబాటులో ఉంటాయి.
- బడ్జెట్ ప్రవేశపెట్టిన తేదీ నుంచి దాన్ని అమలు చేయాలంటే 1-2 నెలల సమయం పడుతుంది. గతంలో మార్చి చివరి నాటికి బడ్జెట్ను ప్రవేశపెట్టేవారు. దాంతో అది జూన్ వరకు అమలు అయ్యేది. కానీ ప్రస్తుతం ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. దాంతో ఏప్రిల్-మే వరకు అమలు అవుతుంది.
- ఫిబ్రవరి 1, 2020లో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో రెండు గంటల నలభై నిమిషాలపాటు ప్రసంగించి సీతారామన్ రికార్డు నెలకొల్పారు.
- మోడీ 3.0 మొదటి బడ్జెట్కు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి మండలిలో ఆమోదం లభించింది.
- సీతారామన్ ఈరోజు పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ 2024ను సమర్పించనున్నారు. ఆమె వరుసగా ఏడో బడ్జెట్ను విడుదల చేస్తూ రికార్డు సృష్టించనున్నారు.