చరిత్రలో ఈరోజు అక్టోబర్ 22

BIKKI NEWS : Today in history october 22nd

Today in history october 22nd

దినోత్సవం

  • అంతర్జాతీయ నత్తి నివారణ అవగాహన దినోత్సవం

సంఘటనలు

1764: బక్సర్ యుద్ధం జరిగింది. బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీ కి, బెంగాలులో మొగలుల పాలకుడు మీర్ కాసిం సేనలకు మధ్య జరిగిన ఈ యుద్ధంలో ఈస్ట్ ఇండియా కంపెనీ గెలిచి, భారత్‌లో తన అధికారాన్ని స్థిరపరచుకుంది. కంపెనీ సేనలకు హెక్టర్ మన్రో నాయకత్వం వహించాడు.
1953: లావోస్ ఫ్రాన్సు నుండి స్వాతంత్ర్యం పొందినది.
1960: మాలి ఫ్రాన్సు నుండి స్వాతంత్ర్యం పొందినది.
1966: సోవియట్ యూనియన్ లూనా-12 అంతరిక్షనౌకను ప్రయోగించింది.
1975: సోవియట్ యూనియన్ ప్రయోగించిన మానవరహిత అంతరిక్ష మిషన్ వెనెర-9 శుక్రగ్రహంపై దిగింది.
1981: పారిస్-లియాన్‌ ల మధ్య టిజివి రైలు సర్వీసు ప్రారంభమైనది.
2008: భారతదేశం తొలి మానవరహిత చంద్రమండల నౌక చంద్రయాన్-1ను ప్రయోగించింది.
2015 : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కి, ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా శంకుస్థాపన ఉద్దండరాయుని పాలెంలో జరిగింది.

జననాలు

1894: కోలవెన్ను రామకోటీశ్వరరావు, స్వాతంత్ర్య సమరయోధుడు, సంపాదకుడు.
1901: కొమురం భీమ్ హైదరాబాదు విముక్తి కోసం అసఫ్ జహి రాజవంశమునకు వ్యతిరేకంగా పోరాడిన ఒక గిరిజన నాయకుడు. (మ.1940)
1927: గుంటూరు శేషేంద్ర శర్మ, తెలుగు కవి, విమర్శకుడు, సాహితీవేత్త. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత

మరణాలు

1996:పండిత గోపదేవ్, సంస్కృతములో మహాపండితుడు, ఆర్యసమాజ స్థాపకుడు, వైదికథర్మ ప్రచారకుడు, దార్శనికవేత్త, కళాప్రపూర్ణ బిరుదాంకితుడు. (జ.1896)
1998: అజిత్ ఖాన్, హిందీ సినిమా నటుడు (జ. 1922)
2001: జీ.రామకృష్ణ , తెలుగు,తమిళ, మళయాళ, నటుడు , రంగస్థల నటుడు.(జ.1939)
2020:నాయిని నర్సింహారెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి. (జ.1934)

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు