చరిత్రలో ఈరోజు అక్టోబర్ 12

★ దినోత్సవం

  • సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చిన రోజు.
  • ప్రపంచ దృష్టి దినోత్సవం

★ సంఘటనలు

1965: 19వ వేసవి ఒలింపిక్ క్రీడలు మెక్సికోలో ప్రారంభమయ్యాయి.
1998: ఢిల్లీ ముఖ్యమంత్రిగా సుష్మా స్వరాజ్ ప్రమాణ స్వీకారం.
1999: ప్రపంచ జనాభా 600 కోట్లకు చేరిన రోజుగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.
2000: జే ఎం ఎం ముడుపుల కేసులో పూర్వపు ప్రధానమంత్రి పి వి నరసింహారావు కు, బూటాసింగుకు కోర్టు మూడు సంవత్సరాల కఠిన కారాగారం, 2 లక్షల జరిమానా విధించింది. (తరువాత వీరిద్దరూ నిర్దోషులుగా బయటపడ్డారు).

★ జననాలు

1911: విజయ్ మర్చంట్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు .
1917: బూర్గుల రంగనాథరావు, తెలుగు, సంస్కృతం, ఆంగ్లం, మరాఠి, ఉర్దూ, హిందీ భాషలలో ప్రావీణ్యం పొందారు. వీరు పలు గ్రంథాలు రచించడమే కాకుండా ఆకాశవాణి నుంచి వీరి చాలా కథలు, నాటికలు ప్రసారమయ్యాయి.
1918: పి.ఎస్. రామకృష్ణారావు, తెలుగు సినిమా నిర్మాత, రచయిత, దర్శకులు. (మ.1986)
1929: రామినేని అయ్యన్న చౌదరి, సంఘసేవకుడు, దాత, కళాపోషకుడు, విద్యావేత్త.
1932: యుషిరో మియురా, తన 70వ యేట, 75వ యేట, 80వ యేట ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కి గిన్నీస్ బుక్‌లో స్థానం సంపాదించుకున్న జపాన్‌కు చెందిన పర్వతారోధకుడు.
1936: రావినూతల శ్రీరాములు బహుగ్రంథకర్త, వ్యాసరచయిత.
1945: పంతుల జోగారావు, వీరి కథనశైలి సూటిగా, సరళంగా, స్వీయానుభవంలో వాస్తవానికి దగ్గరగా ఉంటుంది.
1948: ప్రొతిమా బేడి, ఒడిస్సీ సాంప్రదాయ భారతీయ నృత్య కళాకారిణి. (మ.1998)
1955: హేమా చౌదరి, దక్షిణ భారత సినిమా నటి.
1955: బియ్యాల జనార్ధన్‌రావు, మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, ప్రొఫెసర్. (మ. 2002)
1981: స్నేహ , తెలుగు సినీ నటి .

★ మరణాలు

1967: రామమనోహర్ లోహియా, సోషలిస్టు నాయకుడు, సిద్ధాంతకర్త. భారతదేశంలోని ఇప్పటి సోషలిస్టులకు ఆదిగురువు ఆయన. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో రహస్యంగా రేడియో స్టేషను పెట్టాడు.
1993: పెండేకంటి వెంకటసుబ్బయ్య, రాజకీయ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు, మాజీ గవర్నరు. (జ.1921)
2012: ఘండికోట బ్రహ్మాజీరావు, ఉత్తరాంధ్ర రచయిత, సాహితీ వేత్త. (జ.1922)