చరిత్రలో ఈరోజు మే 07

దినోత్సవం
  • ఠాగూర్ జయంతి
సంఘటనలు

1924: అల్లూరి సీతారామరాజును మేజర్ గుడాల్ కాల్చి చంపాడు.
1946: సోని కార్పొరేషన్ జపాన్లో స్థాపించారు.

జననాలు

1711: డేవిడ్ హ్యూమ్, స్కాటిష్ ఆర్థికవేత్త, చరిత్రకారుడు, తత్త్వవేత్త (మ. 1776)
1812: రాబర్ట్ బ్రౌనింగ్, ఆంగ్ల కవి (మ. 1889)
1861: రవీంద్రనాథ్ టాగూర్, విశ్వకవి, భారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన కవి. (మ.1941)
1921: ఆచార్య ఆత్రేయ, తెలుగు నాటక, సినీ రచయిత. (మ.1989)
1987: సందీప్ కిషన్ , తెలుగు, తమిళ, హిందీ, చిత్రాల నటుడు.

మరణాలు

1920: హెచ్.వి.నంజుండయ్య, మైసూరు విశ్వవిద్యాలయం తొలి ఉపకులపతి, మైసూర్ రాజ్య దీవాన్, పరిపాలనాదక్షుడు, విద్యావేత్త (జ.1860)
1924: అల్లూరి సీతారామ రాజు, విప్లవ వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1897)
1968 పసుపులేటి కన్నాంబ, రంగస్థల నటి, గాయని, చలనచిత్ర కళాకారిణి .
1972: దామోదరం సంజీవయ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి. (జ.1921)
1973: శివ్ కుమార్ బటాల్వి, పంజాబీ భాషా కవి. (జ.1936)
2016: బోయ జంగయ్య, రచయిత. (జ.1942)
2019: గుండా రామిరెడ్డి తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు. (జ.1919)
2022: మోహన్ జునేజా, కన్నడ సినీ నటుడు. (జ.1967)