చరిత్రలో ఈరోజు డిసెంబర్ 04

★ దినోత్సవం

  • భారతదేశ నౌకాదళ దినోత్సవం

★ సంఘటనలు

1829: సతీ సహగమన దురాచారాన్ని నిషేధించారు.
1936: అభ్యుదయ రచయితల సంఘం (అరసం) ఏర్పడింది.

★ జననాలు

1877: ఉన్నవ లక్ష్మీనారాయణ, గాంధేయ వాది, సంఘ సంస్కర్త, స్వాతంత్ర్యయోధుడు, తెలుగు నవలా రచయిత. (మ.1958)
1898: కె శ్రీనివాస కృష్ణన్, భారతీయ భౌతిక శాస్త్రవేత్త. పద్మభూషణ్ గ్రహీత. (మ.1961)
1910: ఆర్.వెంకట్రామన్, భారత మాజీ రాష్ట్రపతి, రాజనీతివేత్త, రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.2009)
1919: ఐ.కె.గుజ్రాల్, భారత 13వ భారతదేశ ప్రధానమంత్రి, దౌత్యవేత్త. (మ.2012)
1922: ఘంటసాల వెంకటేశ్వరరావు, తెలుగు సినిమా సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు. (మ.1974)
1929: గడ్డం రాంరెడ్డి, దూరవిద్య ప్రముఖులు, సమాజ శాస్త్ర విజ్ఞానంలో మేటి వ్యక్తి. వీరిని “సార్వత్రిక విశ్వవిద్యాలయ పితామహుడు” (మ. 1995)
1945: ఇంద్రగంటి జానకీబాల, నవలా రచయిత్రి, కవయిత్రి, సంపాదకురాలు, ఆకాశవాణి లలిత సంగీత కళాకారిణి.
1962: ఆర్.గణేష్, ఎనిమిది భాషలలో శతావధానం చేశాడు.
1977: అజిత్ అగార్కర్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
1981: రేణూ దేశాయ్, తెలుగు నటి, రూపదర్శి, కాస్ట్యూం డిజైనర్.
1982: ఆస్ట్రేలియాకు చెందిన ఒక వక్త, క్రైస్తవ మత ప్రచారకుడు నిక్ వుజిసిక్

★ మరణాలు

2021: కొణిజేటి రోశయ్య, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల గవర్నరు (జ. 1933)