రేషన్ కార్డుదారులకు ఇక సన్న బియ్యం

BIKKI NEWS (AUG 22) : Thin rice to white ration card holders in telangana. తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు జనవరి 2025 నుండి సన్నబియ్యం సరఫరా చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

Thin rice to white ration card holders in telangana

ఈరోజు సచివాలయంలో అధికారులతో ఆయన విజిలెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో ఇది ప్రధానమైనదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన బియ్యం అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.

సన్నబియ్యం సరఫరా సమయంలో బియ్యం పక్కదారి పడితే వెంటనే డీలర్‌షిప్ రద్దు చేస్తామని తెలిపారు. అలాగే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అలాగే నూతనంగా 1,629 రేషన్ డీలర్ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని తెలిపారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు