నేడు ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ

BIKKI NEWS (OCTM 24) : TGEJAC MEETS CM REVANTH REDDY TODAY. తెలంగాణ రాష్ట్ర ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మధ్యాహ్నం 3:30 గంటలకు బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమావేశం కానున్నారు.

TGEJAC MEETS CM REVANTH REDDY TODAY

ఈ సమావేశానికి దాదాపు 30 మంది ఉద్యోగ సంఘాల నాయకులు హజరు కానున్నారు. ఈ సమావేశంలో 6 ప్రధాన దిమాండ్లు మరియు ఉద్యోగుల ఇతర 51 సమస్యలపై చర్చ జరిగే అవకాశం ఉంది.

త్వరలోనే జరగనున్న మంత్రి వర్గ సమావేశం నేపథ్యంలో ఎంప్లాయీస్ యూనియన్స్ తో సీఎం భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా DA లపై చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే పీఆర్సీ, 317 జీవో సమస్య పరిష్కారం, ఆరోగ్య కార్డుల పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు