జీజేసీ సంగెంకు నూతన గ్రీన్ బోర్డులను అందజేసిన అధ్యాపకులు

BIKKI NEWS (SEP. 10) : Regularized CJLs donated class boards to GJC Sangem. ప్రభుత్వ జూనియర్ కళాశాల సంగెం కు నూతనంగా క్రమబద్ధీకరణ కాబడిన జూనియర్ లెక్చరర్ లు తరగతి గదులలో నూతన గ్రీన్ బోర్డులను ఏర్పాటు చేశారు. వీటిని కళాశాల ప్రిన్సిపాల్ కే. మాధవరావు గారి చేతుల మీదుగా ఈ రోజు ప్రారంభించడం జరిగింది.

Regularized CJLs donated class boards to GJC Sangem

ఈ సందర్భంగా ప్రిన్సిపల్ గారు మాట్లాడుతూ గత సంవత్సరం నూతనంగా రెగ్యులరైజ్ అయిన 8 మంది అధ్యాపకులు కలిసి కళాశాలకి వేల రూపాయల విలువైన తరగతి గది బోర్డులను అందించడం చాలా సంతోషదాయకమని మరియు ఇలాగే విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు అధ్యాపకులు అందరు కృషి చేసి కళాశాలని ఉన్నత స్థాయిలో ఉండేలా చేయాలని పేర్కొన్నారు.

నూతనంగా క్రమబద్ధీకరణ కాబడిన అధ్యాపకులు అనిల్ కుమార్, నాగరాజు, కుమార స్వామి, బుచ్చిరెడ్డి, యాక సాయిలు, కుమార స్వామి, మాధవి, రాఖీ లు తరగతి గది బోర్డులను అందజేశారు.

ఈ కార్యక్రమంలో కళాశాల సీనియర్ అధ్యాపకులు విజయ నిర్మల, గ్రంథ పాలకులు రాజకుమార్, పవన్ కుమార్, చిరంజీవి, సుదీర్ కుమార్, పద్మ, రమాదేవి, సదయ్య, శివ, కార్తీక్, లక్ష్మీ, సంగీత, సమ్మయ్య విద్యార్తినివిద్యార్థులు పాల్గొన్నారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు