BIKKI NEWS (MAY 01) : ఒకటో తరగతిలో పిల్లల అడ్మిషన్లకు ఆరేండ్ల నిబంధనను 2024-25 విద్యా సంవత్సరంలో అమలు చేయడం లేదని (no 6 years age rule for first class admissions in telangana) రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు.
గతంలో కొనసాగిన నిబంధనలే కొనసాగుతాయని తెలిపారు. మ కేంద్ర విద్యాశాఖ ప్రకటించిన ఆరేండ్ల నిబంధనను తెలంగాణ సహా ఏడు రాష్ట్రాలు అమలు చేయడం లేదని తెలిపారు. దీని అమలుకు సమస్యలున్న నేపథ్యంలో మరింత సమయం కోరినట్టు చెప్పారు.