బదిలీపై వెళ్లిన ప్రిన్సిపాల్ కు మరియు అధ్యాపకులకు ఘన సన్మానం

BIKKI NEWS (SEP. 12) : GJC Kuthbullapur news. కుత్బుల్లాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత ఆరు సంవత్సరాలుగా పనిచేసి సాధరణ బదిలీలలో భాగంగా మిడ్జిల్ జూనియర్ కళాశాలకు వెళ్లిన ప్రిన్సిపాల్ తిరుపతయ్య గారిని మరియు బదిలీపై వెళ్లిన అధ్యాపకులను జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నాగేంద్ర గారి ఆధ్వర్యంలో అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు ఘనంగా సత్కరించి వీడ్కోలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బదిలీపై వెళ్లిన ప్రిన్సిపాల్ తిరుపతయ్య గారు మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు, అదేవిధంగా జూనియర్ కళాశాల అభివృద్ధికి అనేక విధాలుగా పాటుపడ్డామని వివరించారు.

ఈ కార్యక్రమంలో బదిలీపై వెళ్లిన ఐలయ్య, ప్రేమానంద్, వాసవి మరియు జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నాగేందర్ గారు సీనియర్ ఆధ్యాపకులు ఏ. ఉపేందర్, పి ఉపేందర్, మబ్బు పరశురాం, సత్యనారాయణ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు