BIKKI NEWS (NOV. 07) : AADHAR NAME IS FOR JEE MAINS APPLICATION 2025. జేఈఈ మెయిన్స్ 2025 పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తు చేసే సమయంలో ఆధార్ కార్డు లోని పేరే ప్రామాణికమని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది.
AADHAR NAME IS FOR JEE MAINS APPLICATION 2025
పదో తరగతి మెమో, ఆధార్ కార్డులలో వేరు వేరు గా పేర్లు ఉంటే ఆధార్ లోని పేరునే ప్రామాణికంగా తీసుకోవాలని సూచించింది.
ఆన్లైన్ దరఖాస్తు నింపేటప్పుడు ఆధార్, టెన్త్ లలో పేర్లు వేరువేరుగా ఉంటుంటే సరిపోలటం లేదని మెసేజ్ వస్తుందని ఎన్టీఏకు ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా ఆధార్ లో ఉన్న పేరుని ప్రామాణికంగా తీసుకోవాలని వివరణ ఇచ్చింది.
దరఖాస్తు ఇలా చేయాలి
“ఆధార్ లోని పేరు సరిపోలటం లేదు దగ్గర్లోని ఆధార్ సెంటర్ ను సంప్రదించండి” అనే మెసేజ్ వస్తే దాన్ని క్లోజ్ చేయాలని… అప్పుడు వేరే విండో వస్తుందని దాని ద్వారా దరఖాస్తు నింపాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది.