BIKKI NEWS (JULY 23) : Government employees will participate in RSS programmes. ప్రముఖ హిందుత్వ సంస్థ అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యక్రమాలలో ఇక నుండి ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనవచ్చు అంటూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Government employees will participate in RSS programmes
58 సంవత్సరాల క్రితం అప్పటి ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకూడదంటూ ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆ ఉత్తర్వులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ అంశంపై కాంగ్రెస్ ఇతర విపక్షాలు రాజకీయాకలలోకి ఉద్యోగులను లాగి వారిని విభజించడమే లక్ష్యంగా పెట్టుకొని బిజెపి ఆడుతున్న ఆట అంటూ మండిపడ్డాయి. బిజెపి, ఆర్ఎస్ఎస్ మాత్రం ఈ ఉత్తర్వులను స్వాగతించాయి.