WPL 2025 WINNER MUMBAI INDIANS – విజేత ముంబై

BIKKI NEWS (MAR 15) : WPL 2025 WON BY MUMBAI INDIANS. మహిళా ప్రీమియర్ లీగ్ 2025 విజేతగా ముంబై ఇండియన్స్ జట్టు నిలిచింది. ఫైనల్ లో డిల్లీ కెపిటల్స్ పై 8 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

WPL 2025 WINNER MUMBAI INDIANS

మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు 149/7 పరుగులు సాదించింది. హర్మన్ ప్రీత్ కౌర్ 66, బ్రంట్ – 33 పరుగులతో రాణించారు.

అనంతరం 150 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన డిల్లీ జట్టు 141/9 పరుగులు మాత్రమే సాదించగలిగింది. కప్ – 40, జెమీమా 30 పరుగులతో రాణించారు.

ముంబై ఇండియన్స్ జట్టు రెండో సారి WPL విజేతగా నిలిచింది.

డిల్లీ కెపిటల్స్ మూడు సార్లు ఫైనల్ కి చేరిన కప్ కొట్టలేకపోయింది.

ఫైనల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా హర్మన్ ప్రీత్ కౌర్ నిలువగా… ప్లేయర్ ఆఫ్ దసిరీస్ గా నట్ స్కివర్ బ్రంట్ నిలిచింది.

అత్యదిక పరుగులు (523) సాదించిన నట్ స్కివర్ బ్రంట్ ఆరెంజ్ క్యాప్ విజేతగా నిలిచింది.

అత్యధిక వికెట్లు (19) సాదించిన అమెలియా కెర్ పర్పుల్ క్యాప్ విజేతగా నిలిచింది.

విజేతకు 6 కోట్లు, రన్నర్ కు 3 కోట్ల రూపాయాల ప్రైజ్ మనీ అందజేశారు.

2025 – ముంబై (డిల్లీ పై)
2024 – బెంగళూరు (డిల్లీ పై)
2023 – ముంబై (డిల్లీ పై)

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు