వింబుల్డన్ మహిళల టెన్నిస్ సింగిల్స్ విజేతగా ఆస్ట్రేలియా క్రీడాకారిణి ఆష్లే బార్టీ విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్లో కరోలినా ప్లిస్కోవా(చెక్ రిపబ్లిక్కు)పై గెలుపొందింది. కెరీర్లో తొలి వింబుల్డన్ టైటిల్ను బార్టీ కైవసం చేసుకుంది.
ఈ ఫైనల్ మ్యాచ్ లో ప్లిస్కోవాపై 6-3, 6-7, 6 -3 తేడాతో గెలుపొంది, 1980 తర్వాత వింబుల్డన్ ట్రోఫీ గెలిచిన ఆస్ట్రేలియా క్రీడాకారిణిగా బార్టీ రికార్డు సృష్టించింది.