TSPSC CHAIRMAN – మహేందర్ రెడ్డి నియామకం

హైదరాబాద్ (జనవరి – 25) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఐపీఎస్ ఆఫీసర్ మహేందర్ రెడ్డిని (TSPSC NEW CHAIRMAN MAHENDER REDDY( ప్రతిపాదించగా గవర్నర్ తమిళసై ఆమోదం తెలిపారు.

ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ నూతన చైర్మన్ గా ఐపీఎస్ మహేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు.

అలాగే 5గురు సభ్యులను కూడా నియమిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. సభ్యులుగా రిటైర్డ్ ఐఏఎస్ అనితా రాజేంద్ర, పాల్వాయి రజనీ కుమారి, అమరుల్లా ఖాన్, యాదయ్య, రామోహన్‌రావు లను నియమించారు. దీంతో ఉద్యోగ నియామక ప్రక్రియ మళ్ళీ ప్రారంభం కానుంది.