GROUP – 2 : సిలబస్ లో మార్పులు

హైదరాబాద్, (జనవరి 02) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 783 పోస్టులతో ఇటీవల విడుదల చేసిన గ్రూప్-2 ఉద్యోగాల సిలబస్ లో కొన్ని మార్పులు చేసింది. గ్రూప్-2లో మొత్తం నాలుగు పేపర్లు ఉండగా, 600 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితులకు తగినట్టు అదనంగా పలు అంశాలను జత చేసింది.

పేపర్ 2 లో స్వల్ప మార్పులు చేయగా, పేప ర్-3లో ఎక్కువ మార్పులు జరిగాయి. పేపర్-1, 4లో మార్పులేవీ చేయలేదు.

◆ పేపర్-2 : రెండో సెక్షన్ లోని పాలిటీలో కొత్తగా రాజ్యాంగ సవరణ విధానం, సవరణ చట్టాలను ప్రత్యేకంగా పేర్కొన్నారు. జాతీయ సమగ్రత, అంతర్గత భద్రత, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు తదితర అంశాలు చేర్చారు.

మూడో సెక్షన్లో భారతీయ సాంఘిక నిర్మాణంలో ఎర్నిసిటీ, మతం మహిళలు అనే అంశాన్ని చేర్చారు.

◆ పేపర్ – 3 : ఒకటో సెక్షన్ లో డెమోగ్రఫీ(జనాభా శాస్త్రం), ప్రాథమిక, ద్వితీయ రంగాలు, పరిశ్రమలు, సేవారంగం, ప్లానింగ్, నీతిఆయోగ్- పబ్లిక్ ఫైనాన్స్ జతచేశారు. రెండో సెక్షన్ లో తెలంగాణ ఎకానమీ నిర్మాణం, వృద్ధితో పాటు జనాభా-మానవవనరుల అభి వృద్ధి, వ్యవసాయం-అనుబంధ రంగాలు, పరిశ్రమలు-సేవా రంగాలు, రాష్ట్ర ఫైనాన్స్, బడ్జెట్, పాలసీలు చేర్చారు.

మూడో సెక్షన్ లో అభివృద్ధి-అండర్ డెవలప్ మెంట్, పేదరికం-నిరుద్యోగిత, పర్యావరణం- సుస్థిర అభివృద్ధిని కొత్తగా కలిపారు.