హైదరాబాద్ (మే 28) : తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో మొత్తం 587 ఎస్సై, తత్సమాన ఉద్యోగాల కోసం ఇటీవల నిర్వహించిన తుది రాత పరీక్ష ఫలితాలను జూన్ రెండో వారంలో ప్రకటించనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే తుది రాతపరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ కీని విడుదల చేసిన బోర్డు, అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించింది. త్వరలోనే ఫైనల్ కీని వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నది.
మొత్తం 17,516 పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన రిక్రూట్ మెంట్ ప్రక్రియ చివరి దశకు చేరుకున్నది.