హైదరాబాద్ (జూన్ – 29): టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్(TET – 2022) ఫైనల్ కీ టెట్ కన్వీనర్ రాధారెడ్డి బుధవారం విడుదల చేశారు. ప్రస్తుతం జూలై 1న టెట్ ఫలితాలను విడుదల చేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నది.
జూన్ 12న టెట్ పరీక్ష నిర్వహించగా.. పేపర్-1కు 3,18,506 మంది అభ్యర్థులు, పేపర్-2కు 2,51,070 మంది హాజరయ్యారు. ఈ నెల 15న ప్రైమరీ కీ విడుదలవగా.. ప్రస్తుతం ఫైనల్ కీని అధికారులు విడుదల చేశారు.
Follow Us @