INTER – కొత్తగా CEA గ్రూపు

హైదరాబాద్(జనవరి – 26) : తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యలో కొత్తగా అకౌంటెన్సీ సబ్జెక్టుకు ప్రాధాన్యమిస్తూ (INTER EDUCATION OFFERS CEA GROUP) CEA గ్రూప్ ను నూతనంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్నారు. ఈ గ్రూప్ లో అకౌంటెన్సీతో పాటు కామర్స్, ఆర్థికశాస్త్రం ప్రధాన సబ్జెక్టులుగా ఉండనున్నాయి.

“ఇంటర్ స్థాయిలోనే విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు పొందేందుకు వీలుగా సీఈఏ గ్రూపును రూపొందిస్తున్నాం. బోర్డు సమావేశం ఆమోదించింది. వచ్చే విద్యా సంవ త్సరం(2023–24) నుంచి అందుబాటులోకి తెస్తాం” అని ఇంటర్బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎంపీసీ, బైపీసీ, హెచ్ఐసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపులు ఉన్నాయి.