హైదరాబాద్ (జూలై – 07) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) జూన్ 8 న నిర్వహిస్తున్న టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ (TPBO) పరీక్షకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరంగల్, హనుమకొండ పర్యటన నేపథ్యంలో భారీ ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. కావునా పరీక్ష రాసే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు ఉదయం 8 గంటల వరకు చేరుకోవాలని., పరీక్ష నిర్వహించే సిబ్బంది ఉదయం 7 గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.
టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ (TPBO) పరీక్షను జూలై 8వ తేదీన రెండు సెషన్లలో నిర్వహించనున్నారు ఉదయం 10.00 గంటలనుండి 12.30 గంటల వరకు., మధ్యాహ్నం 2.30 గంటల నుండి 5.00 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.