TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 03 – 01 – 2025

BIKKI NEWS (JAN. 03) : TODAY NEWS IN TELUGU on 3rd JANUARY 2025

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 3rd JANUARY 2025

TELANGANA NEWS

గ్రామీణ రోడ్ల నిర్మాణానికి రూ.1000 కోట్ల కేటాయింపు. – సీఎం

కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు తమ సమస్యలు చెబితే పరిష్కారానికి చర్యలు చేపడతామని సీఎం తెలిపారు.

రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు

రాష్ట్రంలో కనిష్ఠానికి పడిపోయిన ఉష్ణోగ్రతలు.. అత్యల్పంగా సిర్పూర్‌లో 6.5 డిగ్రీలు

మార్గదర్శి ఫైనాన్షియర్లు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్టు నమోదైన కేసులో తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు కౌంటర్లు దాఖలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు (కేఆర్‌ఎంబీ) సమావేశాన్ని ఈ నెల 21న నిర్వహించేందుకు నిర్ణయించారు

ప్రపంచ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో మూడురోజుల పాటు జరుగనున్న ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభం.

అంగన్‌వాడీలకు సొంతభవనాల నిర్మాణం, తాగునీటి కనెక్షన్లు త్వరగా పూర్తి చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు.

తెలంగాణ న్యాయ మంత్రిత్వ శాఖ, సబార్డినేట్‌ సర్వీస్‌లో 1,673 పోస్టుల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఫార్ములా-ఈ కేసులో విచారణకు హాజరు కావాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావుకు రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నోటీసులు జారీచేసింది.

తెలంగాణ ప్రత్యేక పోలీస్‌ విభాగం(టీజీఎస్పీ)లో బాక్సింగ్‌, క్రికెట్‌ కోచింగ్‌ కేంద్రాలు నెలకొల్పాలని యోచిస్తున్నట్టు డీజీపీ జితేందర్‌ వెల్లడించారు

ANDHRA PRADESH NEWS

ఇకపై తెలుగులోనూ ఉత్తర్వులు ఇవ్వాలి.. ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

కోటి రూపాయలు అయిన ఇస్తాను కానీ నా పుస్తకాలు ఇవ్వ‌ను : డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్

జగన్‌ కేవలం తన బస్సులను సీజ్‌ చేయించారని.. కానీ మీరు మాత్రం బస్సులు తగలబెడుతున్నారంటూ ఏపీ బీజేపీ నాయకులపై జేసీ ప్రభాకర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.

విశాఖ సెంట్రల్ జైల్లో మొబైల్ పోన్స్ కలకలం

NATIONAL NEWS

మెడికల్‌ కోర్సుల్లో సీట్లు ఖాళీగా ఉండకూడదు – సుప్రీంకోర్టు

కేంద్ర ఉద్యోగులపై ఎఫ్‌ఐఆర్‌కు సీబీఐకి రాష్ట్ర అనుమతి అక్కర్లేదు – సుప్రీం కోర్టు

రాబోయే ఐదేళ్లలో కాలుష్య రహిత నగరంగా ఢిల్లీని తీర్చిదిద్దుతాం : కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ

10 నిమిషాల్లో రోగుల చెంతకు.. బ్లింకిట్‌ అంబులెన్స్ సేవలు

దేశంలో ఎక్కడి నుంచైనా, ఏ బ్యాంకు నుంచైనా పెన్షన్‌ పొందేందుకు ఈపీఎఫ్‌వో వీలు కల్పించింది.

రైల్వే ట్రాక్‌పై ప‌బ్‌జీ ఆడుతూ.. ముగ్గురు యువ‌కులు దుర్మ‌ర‌ణం

చలిగాలులతో గజగజ వణుకుతున్న ఉత్తర భారతం, విమాన, రైలు సేవలకు అంతరాయం

INTERNATIONAL NEWS

7.5 క్యారట్‌ సింథటిక్‌ వజ్రాన్ని ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుని సతీమణి జిల్‌ బైడెన్‌కు 2023 లో బహుమతిగా అందజేశారు.

చైనాలో మరో వైరస్‌ విజృంభిస్తున్నది. హ్యూమన్‌ మెటాన్యూమోవైరస్‌(హెచ్‌ఎంపీవీ) కేసులు పెరుగుతున్నాయి.

100 జీబీపీఎస్‌ వేగంతో 6జీ టెక్నాలజీ ని విజయవంతం గా పరీక్షించిన చైనాకు చెందిన చాంగ్‌ గువాంగ్‌ శాటిలైట్‌ టెక్నాలజీ సంస్థ.

స్విట్జర్లాండ్‌ బురఖా ధరించటాన్ని నిషేధించింది

BUSINESS NEWS

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

సెన్సెక్స్ : 79,223.11 (-720.60)
నిఫ్టీ : 24,004.75 (-183.90)

2024 డిసెంబర్‌ 27వ తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్‌ రిజర్వ్‌ నిల్వలు 4.112 బిలియన్ డాలర్లు నష్టపోయి 640.279 బిలియన్ డాలర్లకు చేరాయని ఆర్బీఐ వెల్లడించింది.

SPORTS NEWS

సిడ్నీ టెస్ట్ లో ఇండియా ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో 185కి ఆలౌటైంది. ఆసీస్ 9/1 పరుగులతో ఉంది.

భారత్‌ వేదికగా ఈనెల 13 నుంచి మొదలుకాబోతున్న ఖో ఖో ప్రపంచకప్‌ కోసం ట్రోఫీతో పాటు మస్కట్స్‌ తేజస్‌, తారను విడుదల చేశారు.

EDUCATION & JOBS UPDATES

తెలంగాణ న్యాయ మంత్రిత్వ శాఖ, సబార్డినేట్‌ సర్వీస్‌లో 1,673 పోస్టుల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఎపీ ఎడ్‌సెట్, లాసెట్ స్పాట్ కౌన్సెలింగ్ గడువు పెంపు

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు