చరిత్రలో ఈరోజు జూన్ – 05

◆ దినోత్సవం

  • ప్రపంచ పర్యావరణ దినోత్సవం

◆ సంఘటనలు

1968: అమెరికా సెనేటరు రాబర్ట్ ఎఫ్. కెన్నడీపై సిర్హన్ సిర్హన్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ సంఘటన లాస్ ఆంజిల్స్‌లోని ది అంబాసిడర్ హోటల్లోని వంటశాలలో జరిగింది.
1972: స్వీడన్ రాజధాని స్టాక్‌హోంలో మొట్టమొదటి పర్యావరణ సదస్సు నిర్వహించబడింది.
1995: “బోస్-ఐన్‌స్టీన్ కండెన్సేట్”ను మొదటి సారి సృష్టించారు.
2008: 3000 మీటర్ల పరుగులో సురేంద్రసింగ్ భారత జాతీయ రికార్డు సృష్టించాడు. 16 సంవత్సరాల బహదూర్ ప్రసాద్ రికార్డు ఛేదించబడింది.

◆ జననాలు

1908: రావి నారాయణరెడ్డి, కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణ పోరాటంలో ముఖ్యుడు. (మ.1991)
1934: చెన్నుపాటి విద్య, భారత పార్లమెంటు సభ్యురాలు, సంఘ సేవిక.
1941: ఆచార్య ఎస్వీ రామారావు, పి.హెచ్.డి. పరిశోధనా పర్యవేక్షకుడిగా కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇతని పర్యవేక్షణలో 19 పి.హెచ్.డి పరిశోధనలు, 15 ఎం.ఫిల్ పరిశోధనలు జరిగాయి.
1943: రాయపాటి సాంబశివరావు, భారత పార్లమెంటు సభ్యుడు.
1961: రమేశ్ కృష్ణన్, భారత టెన్నిస్ క్రీడాకారుడు.
1968: మూరెళ్ల ప్రసాద్, తెలుగు సినిమా ఛాయాగ్రాహకుడు. ఇతడు ఎక్కువగా తెలుగు, కొన్ని తమిళ సినిమాలకు పనిచేశారు.
1976: రంభ (నటి), తెలుగు సినిమా నటి.

◆ మరణాలు

1973: మాధవ్ సదాశివ్ గోల్వాల్కర్, గురూజీగా ప్రసిద్ధి చెందిన హిందుత్వ నాయకుడు (జ.1906).
1996: ఆచార్య కుబేర్‌నాథ్ రాయ్, భారతీయ రచయిత, జ్ఞానపీఠ పురస్కర గ్రహీత (జ.1933).
2022: మెండు శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్టు.