భారత దేశం మొత్తంలో కామారెడ్డి జిల్లా డిజిటల్ గవర్నెన్స్లో సమర్థవంతమైన జిల్లాగా గుర్తింపు పొంది డిజిటల్ ఇండియా అవార్డులో భాగంగా వెబ్రత్న 2020 అవార్డును దక్కించుకున్నది. డిసెంబర్ 30న ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ శరత్ అందుకోనున్నారు.
జిల్లా గురించి సమాచారం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సంక్షిప్తంగా, వివరణాత్మక అంశాలతో వెబ్సైట్లో నమోదు చేశారు.