హైదరాబాద్ (జూన్ – 27) : తెలంగాణ రాష్ట్రంలో 5,204 స్టాఫ్ నర్సుల పోస్టుల కోసం 40,926 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)ని ఆగస్టు 2న నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఆన్లైన్ మాక్ టెస్ట్ ను (staff nurse jobs mock test link) రాష్ట్ర వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు (TS MHSRB) అవకాశం కల్పించింది.
మొదటిసారి ఆన్లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహిస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల అవగాహన కోసం వెబ్సైట్ లో మాక్ టెస్ట్ రాయవచ్చని తెలిపింది. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ కేంద్రాలుగా ప్రధాన పరీక్ష జరగనుంది.