10th రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కు అవకాశం

హైదరాబాద్ (మే – 20) : తెలంగాణ పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల అయిన విషయం తెలిసిందే. అయితే ఫలితాలు మీద సందేహాలు ఉన్న విద్యార్థులు సమాధాన పత్రాల రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.

విద్యార్థులు మే – 25 లోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. ఒక్కో సబ్జెక్టుకు రీ వెరిఫికేషన్ పాటు జవాబు పత్రం ఫొటోకాపీకి రూ.1,000/-,. రీ కౌంటింగ్ రూ.500/- చెల్లించాలని
సూచించారు.

10th RECOUNTING & RE VERIFICATION LINK